టపాసుల అక్రమ నిల్వలపై పోలీసుల దాడులు నిర్వహించారు. చిత్తూరు జిల్లా నాగలాపురం పట్టణంలో సుమారు 25 లక్షల రూపాయల విలువైన సరకును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. నిందితులపై కేసులు నమోదు చేశామన్నారు. పలు నివాస గృహల్లో అక్రమంగా టపాకాయల నిల్వ ఉన్నట్లు.. స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు అందిన రహస్య సమాచారం మేరకు దాడులు చేశామని వెల్లడించారు.
ఇదీ చదవండి: న్యాయం చేయాలంటూ నిరసనకు దిగిన న్యాయవాది