ETV Bharat / state

శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు

author img

By

Published : Jun 10, 2020, 9:57 AM IST

Updated : Jun 10, 2020, 12:38 PM IST

వీలైతే నెలకోసారి కాలినడకన తిరుమల కొండెక్కి.... శ్రీవారి దర్శనం చేసుకుంటారు వారంతా.! అనూహ్యంగా కరోనా తీవ్రత, లాక్‌డౌన్‌తో... వెంకన్న ఇన్నాళ్లూ ఏకాంతంగా పూజలు అందుకున్నాడు. వైకుంఠనాథుడి సన్నిధిలో మనోస్థైర్యం కలుగుతుందని నమ్మే భక్తులను... దర్శనాలకు దూరంగా ఉంచేసిందీ విపత్తు..! రేపటి నుంచి సామాన్యులకూ శ్రీవారి దర్శనాల పునఃప్రారంభంతో... టోకెన్ల కోసం భక్తులు పోటెత్తారు.

huge number of Devotees visitted Sri balaji temple in tirumala in chittoor district
huge number of Devotees visitted Sri balaji temple in tirumala in chittoor district
తిరుమలలో పోటెత్తిన శ్రీవారి భక్తులు

కోటి కాంతుల వెలుగుల్లో కలియుగ వైకుంఠనాథుడి దివ్యమంగళ రూపం దర్శించుకునేందుకు దక్కిన అవకాశంతో.... భక్తులు పులకరించిపోతున్నారు. సుమారు మూణ్నెళ్ల తర్వాత... శ్రీవారి దర్శనభాగ్యమనే భావన... వారిని ఆనందపరవశులను చేస్తోంది. ప్రయోగాత్మక దర్శనాలు విజయవంతం కావడం వల్ల... తిరుపతిలోని 3 ప్రాంతాల్లో 18 కౌంటర్లలో సామాన్యులకు సర్వదర్శన టోకెన్లను జారీ చేశారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న సర్వదర్శనాల కోసం టోకెన్లను.... తిరుపతిలో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భక్తులు.... నేరుగా జారీ చేస్తున్న సర్వదర్శన టోకెన్ల కోసమూ భారీగా తరలివచ్చారు.

పోటెత్తిన భక్తజనం...

ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించగా.... భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. ఒక దశలో రద్దీ అనూహ్యంగా పెరగడం వల్ల.... క్యూలో నిలబడేందుకు పోలీసులు అనుమతించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత శ్రీవారి దర్శనానికి దక్కిన అవకాశం కావడం వల్ల.... కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడి మరీ టోకెన్లు సంపాదించారు. దర్శనభాగ్యం అవకాశం పొందిన వారు.... భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

టోకెన్ల జారీ పెంపు...

శ్రీవారి దర్శనానికి జారీచేస్తున్న టోకెన్లు పరిమిత సంఖ్యలో ఉండటం సహా... క్యూలో ఉన్న భక్తుల సంఖ్యలో పెరుగుదలతో.... శనివారం వరకు టోకెన్లు జారీచేయాలని తితిదే నిర్ణయించింది. అందుకు అనుగుణంగా క్యూలైన్లలో ఉన్నవారికి సర్వదర్శన టోకెన్లు జారీచేశారు.

ఇదీ చదవండి: తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం

తిరుమలలో పోటెత్తిన శ్రీవారి భక్తులు

కోటి కాంతుల వెలుగుల్లో కలియుగ వైకుంఠనాథుడి దివ్యమంగళ రూపం దర్శించుకునేందుకు దక్కిన అవకాశంతో.... భక్తులు పులకరించిపోతున్నారు. సుమారు మూణ్నెళ్ల తర్వాత... శ్రీవారి దర్శనభాగ్యమనే భావన... వారిని ఆనందపరవశులను చేస్తోంది. ప్రయోగాత్మక దర్శనాలు విజయవంతం కావడం వల్ల... తిరుపతిలోని 3 ప్రాంతాల్లో 18 కౌంటర్లలో సామాన్యులకు సర్వదర్శన టోకెన్లను జారీ చేశారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న సర్వదర్శనాల కోసం టోకెన్లను.... తిరుపతిలో అందుబాటులో ఉంచింది. ఇప్పటికే ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన భక్తులు.... నేరుగా జారీ చేస్తున్న సర్వదర్శన టోకెన్ల కోసమూ భారీగా తరలివచ్చారు.

పోటెత్తిన భక్తజనం...

ఉదయం ఏడున్నర గంటలకు టోకెన్ల జారీ ప్రారంభించగా.... భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. ఒక దశలో రద్దీ అనూహ్యంగా పెరగడం వల్ల.... క్యూలో నిలబడేందుకు పోలీసులు అనుమతించలేదు. సుదీర్ఘ విరామం తర్వాత శ్రీవారి దర్శనానికి దక్కిన అవకాశం కావడం వల్ల.... కిలోమీటర్ల మేర లైన్లలో నిలబడి మరీ టోకెన్లు సంపాదించారు. దర్శనభాగ్యం అవకాశం పొందిన వారు.... భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.

టోకెన్ల జారీ పెంపు...

శ్రీవారి దర్శనానికి జారీచేస్తున్న టోకెన్లు పరిమిత సంఖ్యలో ఉండటం సహా... క్యూలో ఉన్న భక్తుల సంఖ్యలో పెరుగుదలతో.... శనివారం వరకు టోకెన్లు జారీచేయాలని తితిదే నిర్ణయించింది. అందుకు అనుగుణంగా క్యూలైన్లలో ఉన్నవారికి సర్వదర్శన టోకెన్లు జారీచేశారు.

ఇదీ చదవండి: తిరుమల స్థానికులకు శ్రీవారి దర్శనం

Last Updated : Jun 10, 2020, 12:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.