ETV Bharat / state

చిత్తూరులో కరోనా విజృంభణ... 11,327 మందికి సోకిన వైరస్

author img

By

Published : Aug 2, 2020, 4:26 PM IST

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. శనివారం ఒక్కరోజే జిల్లాలో 949 పాజిటివ్ కేసులు నమోదు కాగా... జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11,327కి చేరింది.

corona cases are increasing in chittor district
చిత్తూరులో కరోనా విజృంభణ

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. శనివారం ఒక్కరోజే జిల్లాలో 949 పాజిటివ్ కేసులు నమోదు కాగా... జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11,327కి చేరింది. మహమ్మారి కారణంగా శనివారం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా...జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 114కి చేరుకుంది. ఒక్క తిరుపతిలోనే అధిక సంఖ్యలో నమోదవుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని... అధికారులు 14 రోజుల పాటు నగరంలో లాక్ డౌన్ విధించారు. దుకాణాల నిర్వహణకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతిచ్చారు. 11 గంటల తర్వాత దుకాణాలను మూసి వేయడంతో పాటు.. రోడ్లపైకి వాహనాలను అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 6010 మంది కరోనా నుంచి కోలుకోగా, 5203 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

చిత్తూరు జిల్లాలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. శనివారం ఒక్కరోజే జిల్లాలో 949 పాజిటివ్ కేసులు నమోదు కాగా... జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకూ నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 11,327కి చేరింది. మహమ్మారి కారణంగా శనివారం ఆరుగురు ప్రాణాలు కోల్పోగా...జిల్లాలో కరోనా మృతుల సంఖ్య 114కి చేరుకుంది. ఒక్క తిరుపతిలోనే అధిక సంఖ్యలో నమోదవుతున్న కేసులను దృష్టిలో పెట్టుకుని... అధికారులు 14 రోజుల పాటు నగరంలో లాక్ డౌన్ విధించారు. దుకాణాల నిర్వహణకు ఉదయం 6 నుంచి 11 గంటల వరకే అనుమతిచ్చారు. 11 గంటల తర్వాత దుకాణాలను మూసి వేయడంతో పాటు.. రోడ్లపైకి వాహనాలను అనుమతించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు 6010 మంది కరోనా నుంచి కోలుకోగా, 5203 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదీ చదవండి:

కరోనా కట్టడికి కాల్​ సెంటర్ ఏర్పాటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.