ETV Bharat / state

తితిదే అనుగ్రహం కోసం ఎదురుచూపు

author img

By

Published : Mar 21, 2021, 5:35 PM IST

తమ కోర్కెలు తీర్చమని భక్తులు నిత్యం శ్రీవారిని వేడుకుంటారు. అలాంటిది తితిదే కళాశాలల్లో పనిచేస్తున్న ఒప్పంద గ్రంథాలయాధికారులు మాత్రం స్వామివారి దయతో తితిదే ఉన్నతాధికారుల అనుగ్రహం కావాలని ఎదురుచూస్తున్నారు.

contract library officers waiting for their postings in ttd colleges thirupathi
తిరుపతిలో గ్రంథాలయం

తితిదే ఆధ్వర్యంలో జూనియర్‌, డిగ్రీ, ప్రాచ్య కళాశాలలు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఆయుర్వేద కళాశాలు ఉన్నాయి. వీటిల్లో ఒప్పంద గ్రంథాలయాలధికారుల కోసం తితిదే ఇంటర్వ్యూలు నిర్వహించి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు డిపాజిట్‌ తీసుకుంది. 2007లో ఇద్దరికి, 2008లో ముగ్గురికి, 2016లో ఒక్కరికి బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఒక కళాశాల నుంచి మరొక కళాశాలకు బదిలీలు, ఇతర కళాశాలలకు అదనపు బాధ్యతలు అప్పగించి విధులు చేయించారు.

తితిదే అధికారుల విన్నపం మేరకు దేవాదాయ శాఖ 2019 నవంబరు 28వ తేదీన జీవో నెం.1411 విడుదల చేసింది. తితిదే కళాశాలల్లోని ఆరు గ్రంథాలయాధికారులు, ఆరు అసిస్టెంట్‌ గ్రంథాలయాధికారుల పోస్టులకు నాన్‌ టీచింగ్‌ సిబ్బంది అర్హత కలిగిన వారు పదోన్నతిపై బదిలీ(ఓన్‌ టైమ్‌ మెజర్‌)పై దరఖాస్తు చేసుకోవచ్చని జీవో సారాంశం. జీవో ద్వారా అర్హత కలిగిన తితిదే శాశ్వత నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు కళాశాలల్లో గ్రంథాలయ, అసిస్టెంట్‌ గ్రంథాలయాధికారులు 8 మంది, పాఠశాలలో ఇద్దరు ప్రస్తుతం పనిచేస్తున్నారు. నాన్‌ టీచింగ్‌ సిబ్బంది రాకతో ఒప్పంద గ్రంథాలయాధికారులు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఒప్పంద సిబ్బంది దేవాదాయ శాఖ జారీ చేసిన జీవో తితిదే సర్వీస్‌ రూల్స్‌కు పూర్తిగా విరుద్ధమని, తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని 5 మంది కోర్టును ఆశ్రయించారు.

పట్టించుకునేవారు లేరు...

కోర్టును ఆశ్రయించిన ఐదుగురిలో నలుగురికి 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి రెన్యూవల్స్‌లో చోటు దక్కలేదు. జీవో ఆధారంగా 2020 జులై 26వ తేదీన నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు పదోన్నతిపై బదిలీ కల్పిస్తూ తితిదే జేఈవో ఆదేశాలు జారీ చేశారు. జీవో నెం.1441ను పక్కన పెట్టాలని ఫిబ్రవరి 15న కోర్టు తీర్పు వెలువరించింది. గతంలో పనిచేసిన ఒప్పంద గ్రంథాలయాధికారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, కోర్టు తీర్పు మేరకు గతంలో పనిచేసిన తమకు అవకాశం కల్పించాలని తితిదే ఉన్నతాధికారులకు, బోర్డుకు విన్నవిస్తున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు వెలువరించి నెల గడుస్తున్నా తితిదే ఇప్పటివరకు జీవో ద్వారా వచ్చిన వారు పదోన్నతి పొందిన ప్రాంతంలో విధులు కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై తితిదే విద్యాశాఖాధికారి గోవిందరాజన్‌ను వివరణ కోరగా కోర్టు పరిధిలోని అంశాలను తాను మాట్లాడరాదని చెప్పారు.

ఇదీచదవండి.

ఈనెల 26న భారత్‌ బంద్​ను‌ విజయవంతం చేయాలి: సీపీఐ

తితిదే ఆధ్వర్యంలో జూనియర్‌, డిగ్రీ, ప్రాచ్య కళాశాలలు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల, ఆయుర్వేద కళాశాలు ఉన్నాయి. వీటిల్లో ఒప్పంద గ్రంథాలయాలధికారుల కోసం తితిదే ఇంటర్వ్యూలు నిర్వహించి ఒక్కొక్కరి నుంచి రూ.10 వేలు డిపాజిట్‌ తీసుకుంది. 2007లో ఇద్దరికి, 2008లో ముగ్గురికి, 2016లో ఒక్కరికి బాధ్యతలు అప్పగించారు. కొన్ని కారణాలతో ఒక కళాశాల నుంచి మరొక కళాశాలకు బదిలీలు, ఇతర కళాశాలలకు అదనపు బాధ్యతలు అప్పగించి విధులు చేయించారు.

తితిదే అధికారుల విన్నపం మేరకు దేవాదాయ శాఖ 2019 నవంబరు 28వ తేదీన జీవో నెం.1411 విడుదల చేసింది. తితిదే కళాశాలల్లోని ఆరు గ్రంథాలయాధికారులు, ఆరు అసిస్టెంట్‌ గ్రంథాలయాధికారుల పోస్టులకు నాన్‌ టీచింగ్‌ సిబ్బంది అర్హత కలిగిన వారు పదోన్నతిపై బదిలీ(ఓన్‌ టైమ్‌ మెజర్‌)పై దరఖాస్తు చేసుకోవచ్చని జీవో సారాంశం. జీవో ద్వారా అర్హత కలిగిన తితిదే శాశ్వత నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులు కళాశాలల్లో గ్రంథాలయ, అసిస్టెంట్‌ గ్రంథాలయాధికారులు 8 మంది, పాఠశాలలో ఇద్దరు ప్రస్తుతం పనిచేస్తున్నారు. నాన్‌ టీచింగ్‌ సిబ్బంది రాకతో ఒప్పంద గ్రంథాలయాధికారులు బయటకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఒప్పంద సిబ్బంది దేవాదాయ శాఖ జారీ చేసిన జీవో తితిదే సర్వీస్‌ రూల్స్‌కు పూర్తిగా విరుద్ధమని, తమను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని 5 మంది కోర్టును ఆశ్రయించారు.

పట్టించుకునేవారు లేరు...

కోర్టును ఆశ్రయించిన ఐదుగురిలో నలుగురికి 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి రెన్యూవల్స్‌లో చోటు దక్కలేదు. జీవో ఆధారంగా 2020 జులై 26వ తేదీన నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులకు పదోన్నతిపై బదిలీ కల్పిస్తూ తితిదే జేఈవో ఆదేశాలు జారీ చేశారు. జీవో నెం.1441ను పక్కన పెట్టాలని ఫిబ్రవరి 15న కోర్టు తీర్పు వెలువరించింది. గతంలో పనిచేసిన ఒప్పంద గ్రంథాలయాధికారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని, కోర్టు తీర్పు మేరకు గతంలో పనిచేసిన తమకు అవకాశం కల్పించాలని తితిదే ఉన్నతాధికారులకు, బోర్డుకు విన్నవిస్తున్నా పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పు వెలువరించి నెల గడుస్తున్నా తితిదే ఇప్పటివరకు జీవో ద్వారా వచ్చిన వారు పదోన్నతి పొందిన ప్రాంతంలో విధులు కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై తితిదే విద్యాశాఖాధికారి గోవిందరాజన్‌ను వివరణ కోరగా కోర్టు పరిధిలోని అంశాలను తాను మాట్లాడరాదని చెప్పారు.

ఇదీచదవండి.

ఈనెల 26న భారత్‌ బంద్​ను‌ విజయవంతం చేయాలి: సీపీఐ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.