ETV Bharat / state

నాటుసారా తరలిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు

author img

By

Published : May 2, 2020, 5:55 PM IST

లాక్​డౌన్ ప్రభావంతో రాష్ట్రంలో మద్యం దుకాణాలు మూతబడ్డాయి. ఫలితంగా గ్రామాల్లో నాటుసారా తయారీ జోరందుకుంది. చిత్తూరు జిల్లా అన్నుపల్లి వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించి తొమ్మిదిమందిపై కేసు నమోదు చేశారు.

Case against nine persons to transport illeagale wine in chithoor district
నాటుసారా తరలిస్తున్న తొమ్మిది మందిపై కేసు నమోదు

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కురువకుప్పం నుంచి నాటుసారాను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రామచంద్రాపురం పోలీసులు అన్నుపల్లి వద్ద దాడులు నిర్వహించారు. ద్విచక్రవాహనంపై తిరుపతికి తరలిస్తున్న తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి, ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మండలంలోని వివిధ ప్రాంతాలలో దాడులు నిర్వహించి 200 లీటర్ల నాటుసారా, 21 ద్విచక్ర వాహనాలు, ఆటో, మహీంద్ర వ్యాన్​ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కురువకుప్పం నుంచి నాటుసారాను అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారంతో రామచంద్రాపురం పోలీసులు అన్నుపల్లి వద్ద దాడులు నిర్వహించారు. ద్విచక్రవాహనంపై తిరుపతికి తరలిస్తున్న తొమ్మిది మందిపై కేసులు నమోదు చేసి, ఆరు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు మండలంలోని వివిధ ప్రాంతాలలో దాడులు నిర్వహించి 200 లీటర్ల నాటుసారా, 21 ద్విచక్ర వాహనాలు, ఆటో, మహీంద్ర వ్యాన్​ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి.

రైతు కూలీలకు నిత్యావసరాలు పంచిన తిరుపతి అర్బన్ ఎస్పీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.