నాలుగో విడత పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి విన్నవించినట్లు భాజపా రాష్ట్ర మీడియా ప్రతినిధి కోలా ఆనంద్ తెలిపారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఎంపీడీవో, ఆర్వోలు, అధికార పార్టీ నేతలు కుమ్మక్కై.. వైకాపా మద్దతుదారులకు ఏకగ్రీవాలు చేయించారని మీడియా సమావేశంలో ఆరోపించారు. తుది విడతలో ఎలాంటి అవకతవకలు, పక్షపాతం లేకుండా ఎన్నికలు జరిపేందుకు అధికారులు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: