ETV Bharat / state

అమర రాజా సంస్థకు నోటీసులు ఇవ్వడం దారుణం: సీఐటీయూ - Citu leaders news in chittoor

అమర రాజా సంస్థను మూసి వేయాలంటూ... కాలుష్య నియంత్రణ మండలి ద్వారా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం దారుణమని సీఐటీయూ నాయకులు ఆరోపించారు.

Citu
Citu
author img

By

Published : May 4, 2021, 10:23 AM IST

దేశవ్యాప్తంగా 82వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా.. జీవనధారంగా ఉన్న అమర రాజా సంస్థను మూసి వేయాలంటూ.. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం దారుణమని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. ఈ కరోనా కల్లోలంలో ఆ పరిశ్రమ యూనిట్లలో ఉపాధి పొందుతున్న 20వేల కార్మిక కుటుంబాలు నడిరోడ్డున పడేసేలా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు సీఐటీయూ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. 35ఏళ్లుగా కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి ధ్రువపత్రాలు ఇస్తున్న పరిశ్రమకు.. ఈ ఏడాది ఇలా ఆదేశాలు ఇవ్వటం కేవలం పరిశ్రమ యాజమాన్యం పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నామన్నారు.

దేశవ్యాప్తంగా 82వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా.. జీవనధారంగా ఉన్న అమర రాజా సంస్థను మూసి వేయాలంటూ.. కాలుష్య నియంత్రణ మండలి ద్వారా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం దారుణమని సీఐటీయూ నాయకులు మండిపడ్డారు. ఈ కరోనా కల్లోలంలో ఆ పరిశ్రమ యూనిట్లలో ఉపాధి పొందుతున్న 20వేల కార్మిక కుటుంబాలు నడిరోడ్డున పడేసేలా తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు సీఐటీయూ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి అన్నారు. 35ఏళ్లుగా కాలుష్య నియంత్రణ మండలి పరిశీలించి ధ్రువపత్రాలు ఇస్తున్న పరిశ్రమకు.. ఈ ఏడాది ఇలా ఆదేశాలు ఇవ్వటం కేవలం పరిశ్రమ యాజమాన్యం పై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగా భావిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి: తిరుమలలో అగ్నిప్రమాదం... ఆరు దుకాణాలు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.