ETV Bharat / state

అమరావతి కోసం తిరుమల కొండపైకి మోకాళ్లపై నడిచిన దంపతులు

author img

By

Published : Feb 28, 2020, 9:10 AM IST

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుతూ తిరుమల కొండపైకి మోకాళ్లపై నడిచారు ఆ దంపతులు . అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ స్వామివారికి మొక్కుకున్నారు. రైతులకు అన్యాయం జరగకుండా కాపాడాలని వేడుకున్నారు.

tirumala
tirumala
అమరావతి కోసం తిరుమల కొండపైకి మోకాళ్లపై నడిచిన దంపతులు

అమరావతి కోసం తిరుమల మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు రాజధానిపై అభిమానం చాటుకున్నారు. పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం తెలుగు యువత అధ్యక్షుడు డి. చౌదరి, పూజిత దంపతులు రాజధాని అమరావతిలోనే ఉండాలనే ఆకాంక్షతో అలిపిరి నడక మార్గంలో మోకాళ్ళపై ఎక్కుతూ కొండపైకి చేరుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని రాజధాని రైతులకు అన్యాయం జరగకుండా కాపాడాలని కోరుకున్నారు.

ఇవీ చదవండి: ఏపీటీడీసీ బస్సు ఎక్కండి..వసతి, ఆతిథ్యం,దర్శనం పొందండి

అమరావతి కోసం తిరుమల కొండపైకి మోకాళ్లపై నడిచిన దంపతులు

అమరావతి కోసం తిరుమల మెట్ల మార్గంలో మోకాళ్లపై నడిచి కృష్ణా జిల్లాకు చెందిన దంపతులు రాజధానిపై అభిమానం చాటుకున్నారు. పెనమలూరు నియోజకవర్గం, ఉయ్యూరు మండలం తెలుగు యువత అధ్యక్షుడు డి. చౌదరి, పూజిత దంపతులు రాజధాని అమరావతిలోనే ఉండాలనే ఆకాంక్షతో అలిపిరి నడక మార్గంలో మోకాళ్ళపై ఎక్కుతూ కొండపైకి చేరుకున్నారు. అనంతరం స్వామి వారిని దర్శించుకొని రాజధాని రైతులకు అన్యాయం జరగకుండా కాపాడాలని కోరుకున్నారు.

ఇవీ చదవండి: ఏపీటీడీసీ బస్సు ఎక్కండి..వసతి, ఆతిథ్యం,దర్శనం పొందండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.