ETV Bharat / state

అమ్మను కొట్టబోయాడని... అన్నను చంపేశాడు!

author img

By

Published : May 26, 2020, 10:00 PM IST

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. మద్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంగా తల్లిని కొట్టబోయిన అన్నను తమ్ముడు హత్య చేశాడు. కత్తెరతో పొడిచి ప్రాణం తీశాడు.

a man killed his brother in chandragiri
a man killed his brother in chandragiri

అన్నను సొంత తమ్ముడే చంపిన ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చోటుచేసుకుంది. చంద్రగిరి ముకుంద వీధిలో బిర్యానీ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న రహమ్మత్​ను మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆమె పెద్ద కుమారుడు అన్సర్ బాషా కొట్టబోయాడు. అక్కడే ఉన్న చిన్న కుమారుడు షాదిక్ భాషా ఈ విషయంపై తన అన్నతో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో షాదిక్ భాషా కత్తెరతో అన్సర్ బాషాపై దాడిచేశాడు. క్షతగాత్రుడిని చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. అనంతరం శవ పరీక్ష కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు షాదిఖ్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.

అన్నను సొంత తమ్ముడే చంపిన ఘటన చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చోటుచేసుకుంది. చంద్రగిరి ముకుంద వీధిలో బిర్యానీ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్న రహమ్మత్​ను మద్యానికి డబ్బులు ఇవ్వలేదని ఆమె పెద్ద కుమారుడు అన్సర్ బాషా కొట్టబోయాడు. అక్కడే ఉన్న చిన్న కుమారుడు షాదిక్ భాషా ఈ విషయంపై తన అన్నతో గొడవ పడ్డాడు. ఈ ఘర్షణలో షాదిక్ భాషా కత్తెరతో అన్సర్ బాషాపై దాడిచేశాడు. క్షతగాత్రుడిని చంద్రగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు పేర్కొన్నారు. అనంతరం శవ పరీక్ష కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు షాదిఖ్​ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి

పోలీసులు బెదిరిస్తున్నారని.. కుటుంబం బలవన్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.