ETV Bharat / state

తిమ్మాపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. 10 మందికి గాయాలు

author img

By

Published : Feb 15, 2021, 5:28 PM IST

చిత్తూరు జిల్లా తిమ్మాపురంలో ఉద్రిక్తత నెలకొంది. వైకాపా - తెదేపా నాయకుల మధ్య ఘర్షణ.. పరస్పర దాడికి దారి తీసింది. ఈ గొడవలో.. 10 మందికి గాయాలయ్యాయి.

clash between two groups at Thimmapuram
తిమ్మాపురంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

చిత్తూరు జిల్లా జీవీ పల్లి మండలం తిమ్మాపురంలో వైకాపా - తెదేపా నాయకుల మధ్య చెలరేగిన ఘర్షణ.. పరస్పర దాడికి దారి తీసింది. ఈ ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయి. వారిని పీలేరు ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

రెండో విడత పల్లె పోరు ఫలితాల్లో తమ అభ్యర్థి విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేకే... వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారంటూ ప్రత్యర్థి వర్గం నేతలు ఆరోపించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

చిత్తూరు జిల్లా జీవీ పల్లి మండలం తిమ్మాపురంలో వైకాపా - తెదేపా నాయకుల మధ్య చెలరేగిన ఘర్షణ.. పరస్పర దాడికి దారి తీసింది. ఈ ఘర్షణలో 10 మందికి గాయాలయ్యాయి. వారిని పీలేరు ఆస్పత్రికి పోలీసులు తరలించారు.

రెండో విడత పల్లె పోరు ఫలితాల్లో తమ అభ్యర్థి విజయం సాధించడాన్ని జీర్ణించుకోలేకే... వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారంటూ ప్రత్యర్థి వర్గం నేతలు ఆరోపించారు. ఇరు వర్గాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

కర్నూలు ప్రమాదం: మృతదేహాల అంత్యక్రియలకు ఏర్పాట్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.