ETV Bharat / state

మండుతున్న ఎండలు.. పెరిగిన విద్యుత్​ వినియోగం..

అసలే ఎండాకాలం...ఆపై వేడి... ఇంకేముంది ఉక్కపోత విపరీతంగా పెరిగింది. వేడి పెరగడంతో.. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరుతోంది. రోజుకు రాష్ట్రంలో సగటున 175.4 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరమవుతుందంటే విద్యుత్ ఏ మేరకు వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

author img

By

Published : Apr 24, 2019, 8:01 AM IST

ఎండ సుర్రుమంటోంది..విద్యుత్ వినియోగం పెరుగుతోంది!
ఎండ సుర్రుమంటోంది..విద్యుత్ వినియోగం పెరుగుతోంది!
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం రోజుకు 8,354 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. ప్రజలకు అసౌర్యం కలగకుండా కోతలు లేకుండా విద్యుత్​ను పంపిణీ చేస్తున్నట్లు డిస్కంలు స్పష్టం చేస్తున్నాయి.

18వ తేదీన అధికం..
వేసవి దృష్ట్యా శీతలీకరణ కోసం ఎయిర్ కండీషనర్లు... ఇతర విద్యుత్ ఉపకరణాల వినియోగానికి 175 మిలియన్ యూనిట్లు అవసరమవుతున్నట్లు ఏపీ ట్రాన్స్​కో వెల్లడించింది. ఏప్రిల్ నెలలో ఈ విద్యుత్ వినియోగం 192 మిలియన్ యూనిట్లకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీన గరిష్ఠంగా 9 వేల 130 మెగావాట్ల విద్యుత్​ను రాష్ట్రంలో వినియోగించినట్లు ఏపీ ట్రాన్స్​కో గణాంకాలు చెబుతున్నాయి.

పొరుగు రాష్ట్రాల నుంచి..
రాష్ట్రంలోని జెన్​కోకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 68.9 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 5.57 మిలియన్ యూనిట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి 26.9 మిలియన్ యూనిట్లు, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 59.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తోందని ట్రాన్స్ కో చెబుతోంది. ఇటీవల పెరిగిన డిమాండ్ మేరకు పొరుగు రాష్ట్రాల నుంచి 14 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ కొనుగోలు చేశారు.

మరింత పెరిగే అవకాశం!
మధ్యాహ్నం, రాత్రి వేళల్లో విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరుతుందని స్పష్టం చేస్తున్నారు. గతేడాది అక్టోబరు 14వ తేదీన విద్యుత్ గరిష్ఠ వినియోగం 9 వేల 453 మెగావాట్లుగా నమోదు అయ్యిందని.. వాతావరణ పరిస్థితులతో మే నెలలో విద్యుత్ డిమాండ్ పెరిగేందుకు ఆస్కారం ఉందని ట్రాన్స్ కో అంచనా వేస్తోంది. విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరుతున్నందున తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో ఉన్న 3 వేల 183 పైచిలుకు విద్యుత్ సబ్ స్టేషన్లపై విద్యుత్ లోడ్ పెరుగుతోంది.

ఎండ సుర్రుమంటోంది..విద్యుత్ వినియోగం పెరుగుతోంది!
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంటోంది. గృహ, పారిశ్రామిక అవసరాల కోసం రోజుకు 8,354 మెగావాట్ల విద్యుత్ అవసరమవుతోంది. ప్రజలకు అసౌర్యం కలగకుండా కోతలు లేకుండా విద్యుత్​ను పంపిణీ చేస్తున్నట్లు డిస్కంలు స్పష్టం చేస్తున్నాయి.

18వ తేదీన అధికం..
వేసవి దృష్ట్యా శీతలీకరణ కోసం ఎయిర్ కండీషనర్లు... ఇతర విద్యుత్ ఉపకరణాల వినియోగానికి 175 మిలియన్ యూనిట్లు అవసరమవుతున్నట్లు ఏపీ ట్రాన్స్​కో వెల్లడించింది. ఏప్రిల్ నెలలో ఈ విద్యుత్ వినియోగం 192 మిలియన్ యూనిట్లకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 18వ తేదీన గరిష్ఠంగా 9 వేల 130 మెగావాట్ల విద్యుత్​ను రాష్ట్రంలో వినియోగించినట్లు ఏపీ ట్రాన్స్​కో గణాంకాలు చెబుతున్నాయి.

పొరుగు రాష్ట్రాల నుంచి..
రాష్ట్రంలోని జెన్​కోకు చెందిన థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 68.9 మిలియన్ యూనిట్లు, జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 5.57 మిలియన్ యూనిట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రాల నుంచి 26.9 మిలియన్ యూనిట్లు, జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి 59.6 మిలియన్ యూనిట్ల విద్యుత్ వస్తోందని ట్రాన్స్ కో చెబుతోంది. ఇటీవల పెరిగిన డిమాండ్ మేరకు పొరుగు రాష్ట్రాల నుంచి 14 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ కొనుగోలు చేశారు.

మరింత పెరిగే అవకాశం!
మధ్యాహ్నం, రాత్రి వేళల్లో విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరుతుందని స్పష్టం చేస్తున్నారు. గతేడాది అక్టోబరు 14వ తేదీన విద్యుత్ గరిష్ఠ వినియోగం 9 వేల 453 మెగావాట్లుగా నమోదు అయ్యిందని.. వాతావరణ పరిస్థితులతో మే నెలలో విద్యుత్ డిమాండ్ పెరిగేందుకు ఆస్కారం ఉందని ట్రాన్స్ కో అంచనా వేస్తోంది. విద్యుత్ వినియోగం గరిష్ఠానికి చేరుతున్నందున తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల పరిధిలో ఉన్న 3 వేల 183 పైచిలుకు విద్యుత్ సబ్ స్టేషన్లపై విద్యుత్ లోడ్ పెరుగుతోంది.

Dungarpur (Rajasthan), Apr 23 (ANI): Ahead of Lok Sabha elections, Congress president Rahul Gandhi addressed a public rally in Rajasthan's Dungarpur on Tuesday. While addressing the rally, Gandhi said, "Narendra Modi said to all of you that he'll forgive all your debts. He said that he'll give you the right price, food processing factory. But you tell me, did he complete it? Have you got the right price? Who forgive all your debts? Congress party did forgive your debts. Here in Rajasthan, Madhya Pradesh and in Chhattisgarh, elections are happening and I said whatever will happen, farmers' debts should be forgiven in these 3 states. Within two days, all the 3 state governments did the same. And, whenever Narendra Modi comes here, he says where the money will come from? We showed him where the money will came from. Only if Narendra Modi wants to hear. Let me tell you money will come from Anil Ambani's pocket."

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.