ETV Bharat / state

చంద్రయాన్​లో ఇది ఆరంభం మాత్రమే..

చంద్రయాన్​-2 ప్రయోగం ఉత్సాహం నింపిందని ఇస్రో ఛైర్మన్​ శివన్​ అన్నారు.

author img

By

Published : Jul 22, 2019, 4:06 PM IST

చంద్రయాన్​-2 విజయం అనంతరం మాట్లాడుతున్న ఇస్రో ఛైర్మన్​
చంద్రయాన్​-2 విజయం అనంతరం మాట్లాడుతున్న ఇస్రో ఛైర్మన్​

చంద్రయాన్​-2 ప్రయోగం కొత్త ఉత్సాహం నింపిందని ఇస్రో ఛైర్మన్‌ శివన్​ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో చరిత్రాత్మక రోజు అని కొనియాడారు. చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమే అని... మరెన్నో విజయాలు అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నా... గుర్తించిన వారంలోనే పరిష్కరించామని శివన్​ అన్నారు.

శాస్త్రవేత్తలు అందరూ 24 గంటలూ తదేక దీక్షతో పనిచేశారని...ప్రతిక్షణం అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నామని శివన్​ తెలిపారు. శాస్త్రవేత్తల అంకితభావం, కృషి ఇస్రోకి విజయాన్ని అందించిందన్నారు.

లాంఛ్ వెహికల్ టీమ్‌ అత్యంత సునిశిత పరిజ్ఞానంలో విజయం సాధించింది. చంద్రయాన్​ -2 ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ నిష్ఠతో పని చేశారని తెలిపారు.

రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపడంతో... అసలు ప్రయోగం ఇప్పుడు ప్రారంభం అవుతుందన్నారు. వచ్చే 45 రోజులు ఇస్రోకు అత్యంత కీలకమని తెలియజేశారు. సెప్టెంబరు 7 రాత్రి ల్యాండర్‌ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందని శివన్​ వెల్లడించారు. ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణధ్రువంలో దించి రోవర్‌ను బయటకు తేవాల్సి ఉందని తెలిపారు. ఈ శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ పతాకను ఉన్నతంగా ఉంచడమే ఇస్రో లక్ష్యమని వెల్లడించారు.

ఇదీ చదవండి

చంద్రయాన్​-2: విక్రమ్​, ప్రగ్యాన్​లే అసలు హీరోలు!

చంద్రయాన్​-2 విజయం అనంతరం మాట్లాడుతున్న ఇస్రో ఛైర్మన్​

చంద్రయాన్​-2 ప్రయోగం కొత్త ఉత్సాహం నింపిందని ఇస్రో ఛైర్మన్‌ శివన్​ తెలిపారు. భారత అంతరిక్ష పరిశోధన రంగంలో చరిత్రాత్మక రోజు అని కొనియాడారు. చంద్రయాన్‌లో ఇది ఆరంభం మాత్రమే అని... మరెన్నో విజయాలు అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. తీవ్రమైన సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నా... గుర్తించిన వారంలోనే పరిష్కరించామని శివన్​ అన్నారు.

శాస్త్రవేత్తలు అందరూ 24 గంటలూ తదేక దీక్షతో పనిచేశారని...ప్రతిక్షణం అత్యంత కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నామని శివన్​ తెలిపారు. శాస్త్రవేత్తల అంకితభావం, కృషి ఇస్రోకి విజయాన్ని అందించిందన్నారు.

లాంఛ్ వెహికల్ టీమ్‌ అత్యంత సునిశిత పరిజ్ఞానంలో విజయం సాధించింది. చంద్రయాన్​ -2 ప్రయోగాన్ని విజయవంతం చేసేందుకు ప్రతిఒక్కరూ నిష్ఠతో పని చేశారని తెలిపారు.

రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపడంతో... అసలు ప్రయోగం ఇప్పుడు ప్రారంభం అవుతుందన్నారు. వచ్చే 45 రోజులు ఇస్రోకు అత్యంత కీలకమని తెలియజేశారు. సెప్టెంబరు 7 రాత్రి ల్యాండర్‌ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందని శివన్​ వెల్లడించారు. ల్యాండర్‌ను చంద్రుడి దక్షిణధ్రువంలో దించి రోవర్‌ను బయటకు తేవాల్సి ఉందని తెలిపారు. ఈ శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ పతాకను ఉన్నతంగా ఉంచడమే ఇస్రో లక్ష్యమని వెల్లడించారు.

ఇదీ చదవండి

చంద్రయాన్​-2: విక్రమ్​, ప్రగ్యాన్​లే అసలు హీరోలు!

Intro:333


Body:555


Conclusion:వరుణుడు కాస్త కరుణించడంతో కడప జిల్లా బద్వేలు వాసులు అధిక ఉష్ణోగ్రతల నుంచి ఊరట చెందారు రాత్రి కురిసిన వర్షానికి చెరువులకు కొద్దిపాటి నీరు చేరింది బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు కాశినాయన బి.కోడూరు పోరుమామిళ్ల గోపవరం అట్లూరు మండలాల్లో 45 నుంచి 50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదయింది. వ్యవసాయ భూములు కూడా పదును కావడంతో రైతులు వ్యవసాయ పనులను మొదలుపెట్టారు. బద్వేలు పెద్ద చెరువుకు ఎనిమిది రోజుల నీరు చేరింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.