ముఖ్యమంత్రి జగన్ పరిపాలన తీరుపై.. తెదేపా లోక్సభ సభ్యుడు కేశినేని నాని.. సామాజిక మాధ్యమాల్లో వినూత్నంగా నిరసన తెలిపారు. ప్రజావేదికను కూలగొట్టిన నిర్ణయానికి తోడు.. చంద్రబాబు హయాంలో సింగపూర్ - విజయవాడ మధ్య రాకపోకలు చేసిన విమాన సేవలు.. తాజాగా జగన్ హయాంలో నిలిచిపోవడంపై.. ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సీఎం జగన్ సమావేశాల తీరును స్పృశిస్తూ.. ఫేస్బుక్లో సెటైరికల్ పోస్టు చేశారు. ఆ పోస్టుకు.. 'అమరావతిని కూల్చేద్దాం.. హైదరాబాద్ను అభివృద్ధి చేద్దాం' అని కామెంట్ను జత చేశారు.
![ఫేస్బుక్లో తెదేపా ఎంపీ కేశినేని పోస్ట్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/3704548_kesineni.jpg)