ETV Bharat / state

ఎవరీ.. నవ్యాంధ్ర తొలి మహిళా హోం మంత్రి సుచరిత!

నవ్యాంధ్ర తొలి మహిళా హోం మంత్రి మేకతోటి సుచరిత. నిన్న మెున్నటి వరకూ ఈ పేరు చాలమందికి తెలియదు. ఇప్పుడు రాష్ట్రంలో అతి కీలకమైన శాంతి భద్రతల బాధ్యతలను ఆమెకే అప్పగించారు ముఖ్యమంత్రి జగన్. ఈ పరిణామంతో.. ఒక్కసారిగా సుచరిత పేరు మార్మోగుతోంది. ఇంతకీ.. మన నూతన హోం శాఖ మంత్రి సుచరిత నేపథ్యం ఏంటి? ఆమె రాజకీయ అనుభవం ఏంటి?

author img

By

Published : Jun 8, 2019, 7:30 PM IST

Updated : Jun 9, 2019, 10:48 AM IST

home_minister_mekathoti_sucharitha

మేకతోటి సుచరిత.. చాలా కాలంగానే రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె స్వస్థలం గుంటూరు జిల్లా ఫిరంగిపురం. సుచరిత బీఏ చదివారు. ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్​తో ఆమెకు వివాహమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు ఆకర్షితురాలై 2006లో రాజకీయ ప్రవేశం చేశారు. 2006లో కాంగ్రెస్​ నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించారు.

2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్​ స్థానంగా మారింది. ఆ ఏడాదే రాజశేఖరరెడ్డి సుచరితకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించారు. 2009లో తెదేపా అభ్యర్థి కందుకూరి వీరయ్యపై గెలిచారు. గుంటూరు జిల్లాలోని తొలి ఎస్సీ మహిళా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. వైఎస్​ మరణం తర్వాత 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జగన్ వెంట నడిచారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 16వేల మెజార్టీతో గెలిచారు. 2014లో తెదేపా నుంచి బరిలో ఉన్న రావెల కిశోర్​ చేతిలో ఓటమి పాలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా... ప్రజలకెప్పుడూ అందుబాటులోనే ఉన్నారు సుచరిత. తాజా ఎన్నికల్లో ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇప్పుడు జగన్​ కేబినెట్​లో చోటు దక్కించుకున్నారు. ఆ వెంటనే.. నవ్యాంధ్ర తొలి మహిళా హోంమంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.

మేకతోటి సుచరిత.. చాలా కాలంగానే రాష్ట్ర రాజకీయాల్లో ఉన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమె స్వస్థలం గుంటూరు జిల్లా ఫిరంగిపురం. సుచరిత బీఏ చదివారు. ఐఆర్ఎస్ అధికారి మేకతోటి దయాసాగర్​తో ఆమెకు వివాహమైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రకు ఆకర్షితురాలై 2006లో రాజకీయ ప్రవేశం చేశారు. 2006లో కాంగ్రెస్​ నుంచి జెడ్పీటీసీగా విజయం సాధించారు.

2009లో నియోజకవర్గాల పునర్విభజనతో ప్రత్తిపాడు ఎస్సీ రిజర్వ్​ స్థానంగా మారింది. ఆ ఏడాదే రాజశేఖరరెడ్డి సుచరితకు కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ కేటాయించారు. 2009లో తెదేపా అభ్యర్థి కందుకూరి వీరయ్యపై గెలిచారు. గుంటూరు జిల్లాలోని తొలి ఎస్సీ మహిళా ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టారు. వైఎస్​ మరణం తర్వాత 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. జగన్ వెంట నడిచారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో 16వేల మెజార్టీతో గెలిచారు. 2014లో తెదేపా నుంచి బరిలో ఉన్న రావెల కిశోర్​ చేతిలో ఓటమి పాలయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెందినా... ప్రజలకెప్పుడూ అందుబాటులోనే ఉన్నారు సుచరిత. తాజా ఎన్నికల్లో ప్రత్తిపాడు శాసనసభ నియోజకవర్గం నుంచి గెలిచారు. ఇప్పుడు జగన్​ కేబినెట్​లో చోటు దక్కించుకున్నారు. ఆ వెంటనే.. నవ్యాంధ్ర తొలి మహిళా హోంమంత్రిగా అవకాశం దక్కించుకున్నారు.

Lucknow (UP), May 03 (ANI): While speaking exclusively to ANI, Chief Minister of Uttar Pradesh Yogi Adityanath spoke about Amethi and Raebareli seats. Yogi said, "People have hopes with BJP. Congress disappointed people of Amethi and Raebareli since 4 generations. The kind of support BJP candidate Smriti Irani is getting from Amethi, and the number of visits she has made in Amethi in last 5 years is something, which Rahul ji hasn't done even in last 15 years. Rahul Gandhi has not worked there as much as the number of development projects brought in by Smriti ji in Amethi. The people there want a change, and Smriti Irani is there as an option for that change."
Last Updated : Jun 9, 2019, 10:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.