ETV Bharat / state

ఉగ్రరూపం దాల్చనున్న 'ఫొని' - foni dangers

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో  ఏర్పడి పెను తుపాన్‌గా మారిన ఫొని వేగంగా తీరం వైపు దూసుకొస్తోంది. తీర ప్రాంతంలో  గంట‌కు 120 కిలోమీట‌ర్ల వేగంతో పెనుగాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఉన్నందున శ్రీకాకుళం ప్రాంతంలో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

ఉగ్రరూపం దాల్చనున్న 'ఫోని'
author img

By

Published : May 2, 2019, 9:13 AM IST

Updated : May 2, 2019, 11:44 AM IST

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి మ‌చిలీప‌ట్నానికి ఆగ్నేయంగా కేంద్రీకృత‌మైన ఫొని. మరింత తీవ్ర రూపం దాల్చి.. ఉత్తర తూర్పు దిశ‌లో .. ఉత్తరాంధ్ర‌, ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. బలమైన గాలులతో తుపాను ఉధృతంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ పారాదీప్ వద్ద తీరాన్ని తాకి బలహీనపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి స్పష్టం చేస్తోంది.

ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం
ఫొని ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావంతో విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. రేపు, ఎల్లుండి తీవ్ర గాలులతో క‌నిష్టంగా 120 మిల్లీ మీట‌ర్ల నుంచి 180 మిల్లీ మీట‌ర్ల భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశాలున్నాయి

అప్రమత్తం చేస్తోన్న ఆర్టీజీఎస్
ఫొని తుపాన్ గ‌మ‌నం, రాష్ట్రంపై దాని ప్రభావాన్ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అధికారులు ఎప్పటిక‌ప్పుడు అంచ‌నా వేస్తూ.. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారుల్ని అప్రమ‌త్తం చేస్తున్నారు. గాలుల వేగం, వ‌ర్ష సూచ‌న‌లపై నివేదిక‌లు అందిస్తోంది. స‌ర్వైలెన్స్ కెమెరాల స‌హాయంతో.. ఆయా జిల్లాల్లో వాతావ‌ర‌ణ ప్రభావం ఎలా మారుతుందో గ‌మ‌నిస్తోంది. తుపాను తీరం దాటే స‌మ‌యంలో ప్రజ‌లు బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని, సుర‌క్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. తుపాను కార‌ణంగా స‌ముద్ర అల‌లు ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డుతుండటంతో విశాఖ‌, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంత ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని ఆర్టీజీఎస్ అధికారులు కోరుతున్నారు. సంద‌ర్శకులు బీచ్‌ల‌లోకి వెళ్లకుండా స్థానిక అధికారాలను అప్రమ‌త్తం చేస్తోంది.

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి మ‌చిలీప‌ట్నానికి ఆగ్నేయంగా కేంద్రీకృత‌మైన ఫొని. మరింత తీవ్ర రూపం దాల్చి.. ఉత్తర తూర్పు దిశ‌లో .. ఉత్తరాంధ్ర‌, ఒడిశా తీరం వైపు దూసుకొస్తోంది. బలమైన గాలులతో తుపాను ఉధృతంగా మారే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. రేపు మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ పారాదీప్ వద్ద తీరాన్ని తాకి బలహీనపడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఐఎండి స్పష్టం చేస్తోంది.

ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావం
ఫొని ప్రభావం ఉత్తరాంధ్రపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా అధికారులు ప్రజలను అప్రమత్తం చేసి రెడ్ అలెర్ట్ ప్రకటించారు. తుపాను ప్రభావంతో విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో వర్షాలు మొదలయ్యాయి. రేపు, ఎల్లుండి తీవ్ర గాలులతో క‌నిష్టంగా 120 మిల్లీ మీట‌ర్ల నుంచి 180 మిల్లీ మీట‌ర్ల భారీ వ‌ర్షం కురిసే అవ‌కాశాలున్నాయి

అప్రమత్తం చేస్తోన్న ఆర్టీజీఎస్
ఫొని తుపాన్ గ‌మ‌నం, రాష్ట్రంపై దాని ప్రభావాన్ని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ అధికారులు ఎప్పటిక‌ప్పుడు అంచ‌నా వేస్తూ.. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారుల్ని అప్రమ‌త్తం చేస్తున్నారు. గాలుల వేగం, వ‌ర్ష సూచ‌న‌లపై నివేదిక‌లు అందిస్తోంది. స‌ర్వైలెన్స్ కెమెరాల స‌హాయంతో.. ఆయా జిల్లాల్లో వాతావ‌ర‌ణ ప్రభావం ఎలా మారుతుందో గ‌మ‌నిస్తోంది. తుపాను తీరం దాటే స‌మ‌యంలో ప్రజ‌లు బ‌య‌ట‌కు రాకూడ‌ద‌ని, సుర‌క్షిత ప్రాంతాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. తుపాను కార‌ణంగా స‌ముద్ర అల‌లు ఉవ్వెత్తున ఎగ‌సి ప‌డుతుండటంతో విశాఖ‌, శ్రీకాకుళం జిల్లాల్లోని తీర ప్రాంత ప్రజ‌లు అప్రమ‌త్తంగా ఉండాల‌ని ఆర్టీజీఎస్ అధికారులు కోరుతున్నారు. సంద‌ర్శకులు బీచ్‌ల‌లోకి వెళ్లకుండా స్థానిక అధికారాలను అప్రమ‌త్తం చేస్తోంది.

ఇదీ చదవండి

ఫొని తుపానుపై అధికారులతో సీఎస్ సమీక్ష

Intro:222


Body:888


Conclusion:ఆర్టీసీ బస్సులలో ప్రయాణం సురక్షితం. ప్రైవేట్ వాహనాలను ఎక్కు వద్దని వారి ఆదాయం పెంచుకునేందుకు అధికారులు చెప్పడమే కానీ ప్రయాణికుల భద్రత గురించి పట్టించుకోవడం లేదు .కాలం చెల్లిన బస్సులను నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం అడుగుతున్నారు .కడప జిల్లాలో ఆర్టీసీ బస్సు లో ప్రయాణం చేయాలంటే నే భయానికి భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సురక్షితంగా ఇంటికి చేరుతా మా లేదా అన్న భయం నెలకొంది .ఇటీవల తరచూ జరుగుతున్న ప్రమాదాలు కారణం.

కడప జిల్లాలో ఎనిమిది ఆర్టీసీ డిపో లు ఉన్నాయి. బద్వేలు మైదుకూరు , పొద్దుటూరు, పులివెందుల ,రాయచోటి, జమ్మలమడుగు, రాజంపేట ,కడప ఆర్టీసీ డిపోల లో 900 బస్సులు ఉన్నాయి. నిత్యం వేలాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలను చేరుస్తున్నాయి. అయితే పలు డిపోలలో కాలం చెల్లిన బస్సులను కూడా వినియోగిస్తున్నారు .ఇవి తరచూ ప్రమాదాలకు లోనే ప్రయాణికుల ప్రాణాలను హరించడమే కాకుండా గాయాలపాలు చేస్తున్నాయి. అయినా ఆర్టీసీ అధికారులు వీటిని నడుపుతూ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు .ఇటీవల బద్వేలు మైదుకూరు మార్గంలోని 67 జాతీయ రహదారి లోని ఓం పల్లె చెరువు వద్ద కల్వర్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు కాలం చెల్లిన అదే కావడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది .బద్వేలు మైదుకూరు ప్రాంతాలలో ఆర్టీసీ బస్సు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి .కండిషన్ లో ఉన్న బస్సులను నడపకుండా ప్రయాణికుల సహనాన్ని పరీక్షిస్తున్నారు .బద్వేలు ఆర్టీసీ బస్ డిపో లో 3 కాలం చెల్లిన బస్సులు వినియోగిస్తున్నారు. మైదుకూరు డిపో లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండనే ఉంది.

బైట్స్
శ్రీనివాస రావు ఆర్టీసీ డిఎం బద్వేలు.

అనేక పర్యాయాలు బస్సుల లోటుపాట్లు పై యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో సెక్రటరీ నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు బస్సు ప్రమాదాలకు ఒక డ్రైవర్ ఏ కారణం కాదని అనేక సమస్యలు ఉన్నాయని వారు చెబుతున్నారు

బైట్స్
నరసింహులు ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కార్యదర్శి
బోసు బాబు ఆర్టీసీ కార్మిక సంఘం నాయకులు
Last Updated : May 2, 2019, 11:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.