ETV Bharat / state

ఫొని తుపాను బాధితులను ఆదుకోండి: చంద్రబాబు

ఫొని తుపాను బాధితులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ప్రజానీకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.

author img

By

Published : May 2, 2019, 11:54 PM IST

తుపాను బాధితులను ఆదుకోవాలని సీఎం పిలుపు

ఫొని తుపాను బాధితులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ప్రజానీకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఫొని తుపాన్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపారు. నాలుగు జిల్లాల రైతులు, మత్స్యకారులు, ఇతర వర్గాల ప్రజలకు ఈదురుగాలులు, భారీవర్షాల వల్ల అపార నష్టం కలిగే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. బాధిత ప్రజానీకానికి ఆపదల్లో అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గతంలో వాటిల్లిన అనేక విపత్తుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుకొచ్చి బాధితులను ఆదుకున్నారని గుర్తు చేశారు. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లన్న నినాదంతో... దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తితో అందరూ ముందుకొచ్చి సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. తాగునీరు, పాలు, ఆహారం తదితర నిత్యావసరాలను పంపిణీ చేయాలన్నారు.

ఫొని తుపాను బాధితులను ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు, ప్రజానీకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఫొని తుపాన్ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలిపారు. నాలుగు జిల్లాల రైతులు, మత్స్యకారులు, ఇతర వర్గాల ప్రజలకు ఈదురుగాలులు, భారీవర్షాల వల్ల అపార నష్టం కలిగే అవకాశం ఉందని చంద్రబాబు అన్నారు. బాధిత ప్రజానీకానికి ఆపదల్లో అండగా ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. గతంలో వాటిల్లిన అనేక విపత్తుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ముందుకొచ్చి బాధితులను ఆదుకున్నారని గుర్తు చేశారు. సమాజమే దేవాలయం - ప్రజలే దేవుళ్లన్న నినాదంతో... దివంగత ఎన్టీఆర్ స్ఫూర్తితో అందరూ ముందుకొచ్చి సహాయ చర్యల్లో పాల్గొనాలని కోరారు. తాగునీరు, పాలు, ఆహారం తదితర నిత్యావసరాలను పంపిణీ చేయాలన్నారు.

New Delhi, May 02 (ANI): Congress leader Rajiv Shukla put out details of and claimed that six surgical strikes conducted during Manmohan Singh's government. He also slammed the Bharatiya Janata Party (BJP) for using the surgical strike for asking votes.Listing out the details he said, "One surgical strike was conducted on June 19, 2008 in Bhattal Sector in J-K's Poonch, one from Aug 30-September 1, 2011 in Sharda Sector across Neelam River Valley in Kel. One surgical strike was carried out on January 6, 2013 at Sawan Patra Checkpost; one on July 27 and July 28, 2013 at Nazapir Sector; August 6, 2013 at Neelam Valley; and one on January 14, 2014."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.