ETV Bharat / state

కస్తూర్బా పాఠశాలలో కలుషితాహారం.. 30 మంది విద్యార్థులకు అస్వస్థత

author img

By

Published : Nov 17, 2022, 4:17 PM IST

Updated : Nov 17, 2022, 5:48 PM IST

విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
Food poison

16:09 November 17

ఒక విద్యార్థి పరిస్థితి విషమం, రాయచోటి ఆస్పత్రికి తరలింపు

అన్నమయ్య జిల్లా వీరబల్లి కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని ఆహారం కలుషితం కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మెుత్తం 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను వీరబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో.. రాయచోటి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు.. కస్తూర్బా పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

16:09 November 17

ఒక విద్యార్థి పరిస్థితి విషమం, రాయచోటి ఆస్పత్రికి తరలింపు

అన్నమయ్య జిల్లా వీరబల్లి కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలోని ఆహారం కలుషితం కావడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. మెుత్తం 30 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను వీరబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అందులో ఒక విద్యార్థి పరిస్థితి విషమంగా ఉండటంతో.. రాయచోటి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఆయా విద్యార్థుల తల్లిదండ్రులు.. కస్తూర్బా పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 17, 2022, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.