ETV Bharat / state

కడప జంట హత్యలపై లోకేశ్ వ్యాఖ్యలు సరికాదు: వైకాపా నేతలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హత్యారాజకీయాలను ప్రోత్సహించే విధంగా మాట్లాడుతున్నారని వైకాపా నేతలు ఎదురు దాడి చేశారు. అనంతపురంలో ఆయన దిష్టిబొమ్మను వైకాపా నేతలు దహనం చేశారు.

author img

By

Published : Jun 19, 2021, 8:45 PM IST

ysrcp leaders counter attack over nara lokesh
కడప జంట హత్యలపై లోకేశ్ వ్యాఖ్యలు క్షమార్హనీయం

అనంతపురం జిల్లాలో..

సీఎంపై తెదేపా నేత నారా లోకేశ్​ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అనంతపురంలో వైకాపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద నారా లోకేశ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో పాలనకు, ప్రస్తుత పాలనకు తేడా ఏంటో ప్రజలకు తెలుసని అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. రాజకీయ కక్షలు రేపే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని వారు అన్నారు. నారా లోకేశ్​ కంప్యూటర్ వదిలి ప్రజల్లోకి వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి విమర్శించారు.

విజయనగరం జిల్లాలో..

హత్యా రాజకీయాలను ప్రేరేపించే విధంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ వ్యవహరిస్తున్నారని విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కర్నూలులో జరిగిన జంట హత్యలు కేవలం కక్షపూరితమైతే, లోకేశ్​ వాటిని వక్రీకరించి హత్యా రాజకీయాలుగా చిత్రీకరించడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో వడ్డీతో సహా మూల్యం చెల్లించుకుంటారన్న వ్యాఖ్యలు క్షమార్హమన్నారు. కత్తులతో రాజకీయం చేస్తున్నారన్న లోకేశ్​ మాటలు అవివేకమని కొట్టిపారేశారు. చంద్రబాబు, లోకేశ్​ల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతారని అన్నారు.

అనంతపురం జిల్లాలో..

సీఎంపై తెదేపా నేత నారా లోకేశ్​ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని అనంతపురంలో వైకాపా నాయకులు ర్యాలీ నిర్వహించారు. టవర్ క్లాక్ వద్ద నారా లోకేశ్​కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ప్రభుత్వంలో పాలనకు, ప్రస్తుత పాలనకు తేడా ఏంటో ప్రజలకు తెలుసని అనవసరంగా లేనిపోని ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. రాజకీయ కక్షలు రేపే విధంగా మాట్లాడటం సరైన పద్ధతి కాదని వారు అన్నారు. నారా లోకేశ్​ కంప్యూటర్ వదిలి ప్రజల్లోకి వచ్చి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని వైకాపా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి విమర్శించారు.

విజయనగరం జిల్లాలో..

హత్యా రాజకీయాలను ప్రేరేపించే విధంగా తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​ వ్యవహరిస్తున్నారని విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. కర్నూలులో జరిగిన జంట హత్యలు కేవలం కక్షపూరితమైతే, లోకేశ్​ వాటిని వక్రీకరించి హత్యా రాజకీయాలుగా చిత్రీకరించడం దారుణమన్నారు. రానున్న రోజుల్లో వడ్డీతో సహా మూల్యం చెల్లించుకుంటారన్న వ్యాఖ్యలు క్షమార్హమన్నారు. కత్తులతో రాజకీయం చేస్తున్నారన్న లోకేశ్​ మాటలు అవివేకమని కొట్టిపారేశారు. చంద్రబాబు, లోకేశ్​ల మాటలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని.. ఈ రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి కొనసాగుతారని అన్నారు.

ఇవీ చదవండి:

త్వరలో మోదీ కేబినెట్ విస్తరణ- కీలక నేతలకు చోటు!

Vaccination Sunday:రేపు మెగా వ్యాక్సినేషన్.. 10 లక్షల టీకా డోసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.