ETV Bharat / state

మంచినీటి గంట మోగింది.. వాటర్​ బాటిల్​ ఖాళీ అయ్యింది..! - latest news in madakashira

అక్కడ గంట మోగిందంటే పిల్లలందరూ వాటర్ బాటిల్స్​ను ఖాళీ చేసేస్తారు. గంట మోగటానికి వాటర్ బాటిల్ ఖాళీ అవ్వటానికీ ఏంటి సంబంధం అనుకుంటున్నారా? ఆ విషయం గురించి తెలుసుకోవాలంటే అనంతపురం జిల్లా మడకశిర పట్టణం వైపు వెళ్లాల్సిందే.

మోగెను మంచినీటి గంట...!
author img

By

Published : Nov 17, 2019, 8:55 AM IST

మోగెను మంచినీటి గంట...!
అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఉన్న శ్రద్ధ ఇంటిలెక్చువల్ ప్రైవేట్​ పాఠశాలలో గంట మోగగానే విద్యార్థులందరూ వాటర్ బాటిల్స్​ తాగటం మెుదలు పెడతారు. ఇది యాజమాన్యం పెట్టిన నియమం. ఎందుకంటే విద్యార్థులు మంచినీటిని తగు మోతాదులో తీసుకోవటం లేదని గుర్తించిన స్కూలు పెద్దలు ఈ నిబంధన తీసుకొచ్చారు. పాఠశాల ప్రారంభమైన నుంచి ముగిసే వరకూ మూడు సార్లు నీటి గంటను మోగిస్తారు. ఇలా తగు సమయాల్లో నీరు తాగడం వల్ల విద్యార్థులకు డీహైడ్రేషన్, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని యాజమాన్యం వివరిస్తోంది. నీటి గంట కార్యక్రమం మెుదలై ఐదు రోజలవుతోందనీ, నీటిని ఎక్కువ తాగుతున్న విద్యార్థులు ఉత్సాహంగా ఉంటున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ప్రతీ పాఠశాలలో ఈ కార్యక్రమం చెపడితే, అనారోగ్యాలతో విద్యార్థులు బాధపడరని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సారూ..!

మోగెను మంచినీటి గంట...!
అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలో ఉన్న శ్రద్ధ ఇంటిలెక్చువల్ ప్రైవేట్​ పాఠశాలలో గంట మోగగానే విద్యార్థులందరూ వాటర్ బాటిల్స్​ తాగటం మెుదలు పెడతారు. ఇది యాజమాన్యం పెట్టిన నియమం. ఎందుకంటే విద్యార్థులు మంచినీటిని తగు మోతాదులో తీసుకోవటం లేదని గుర్తించిన స్కూలు పెద్దలు ఈ నిబంధన తీసుకొచ్చారు. పాఠశాల ప్రారంభమైన నుంచి ముగిసే వరకూ మూడు సార్లు నీటి గంటను మోగిస్తారు. ఇలా తగు సమయాల్లో నీరు తాగడం వల్ల విద్యార్థులకు డీహైడ్రేషన్, ఇతర ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని యాజమాన్యం వివరిస్తోంది. నీటి గంట కార్యక్రమం మెుదలై ఐదు రోజలవుతోందనీ, నీటిని ఎక్కువ తాగుతున్న విద్యార్థులు ఉత్సాహంగా ఉంటున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. ప్రతీ పాఠశాలలో ఈ కార్యక్రమం చెపడితే, అనారోగ్యాలతో విద్యార్థులు బాధపడరని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

మా ఉద్యోగాలు మాకు ఇప్పించండి సారూ..!

Intro:నీటి గంట అనే కార్యక్రమాన్ని ప్రారంభించి పిల్లల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు ఆ పాఠశాల వారు.


Body:అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని శ్రద్ధ ఇంటలెక్చువల్ ప్రైవేట్ పాఠశాలలో గత కొన్ని రోజులుగా పాఠశాల ప్రారంభ సమయం నుండి ముగిసే సమయంలో మూడుసార్లు నీటి గంటను మోగిస్తారు. గంట మోగగానే విద్యార్థులు వారి చదువుల ను ఆపి నీటి బాటిళ్లను తీసుకొని తగిన మోతాదులో నీటిని సేవిస్తున్నారు.


Conclusion:మా పాఠశాలలో నీటి గంట అనే కార్యక్రమంతో గంట మోగగానే నీటిని తీసుకుంటున్నాం. దానివల్ల శరీరంలో డీహైడ్రేషన్ మరియు జీర్ణ సమస్య ఇతర శారీరక సమస్యలకు గురికాకుండా ఆరోగ్యవంతంగా ఉత్సాహంగా చదువుకో గలుగుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి పాఠశాలలో ప్రారంభించాలని విద్యార్థులు తెలిపారు.


నీటిగంట అనే కార్యక్రమం ప్రారంభించి ఐదు రోజులు కావస్తోంది. ఈ కార్యక్రమం ప్రారంభించక మునుపుకు ఇప్పటికి విద్యార్థుల్లో వ్యత్యాసం కనిపిస్తోంది. ప్రస్తుతం విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా కనిపిస్తున్నారు అంటూ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

బైట్స్ 1 : సానియా, విద్యార్థిని శ్రద్ధ ఇంటలెక్చువల్ పాఠశాల మడకశిర.

బైట్ 2 : రవితేజ, విద్యార్థి, శ్రద్ధ ఇంటలెక్చువల్ పాఠశాల, మడకశిర.

బైట్ 3 : జయ ప్రకాష్, ప్రధానోపాధ్యాయుడు, శ్రద్ధ ఇంటలెక్చువల్ పాఠశాల, మడకశిర.


యు. నాసిర్ ఖాన్, ఈటీవీ భారత్ రిపోర్టర్, మడకశిర, అనంతపురం జిల్లా.

మొబైల్ నెంబర్ : 8019247116.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.