ETV Bharat / state

ఆటో బోల్తా.. ఇద్దరు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు

author img

By

Published : Oct 26, 2021, 9:39 PM IST

అనంతపురం జిల్లాలో విషాదం జరిగింది. ఆటో బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

two died and three injured in road accident
two died and three injured in road accident

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం 75 వీరాపురం వద్ద ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడిన ఘటనలో కేపీ దొడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతిచెందగా, ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం నుంచి బయలుదేరిన ఆటోకు 75 వీరాపురం తండా వద్ద గెదే అడ్డు వచ్చింది. దానిని తప్పించే క్రమంలో బోల్తా పడింది. ఈ ఘటనలో కేపీదొడ్డి గ్రామానికి చెందిన శివమ్మ, లక్ష్మీదేవి అనే మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. గుమ్మగట్ట పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని గుమ్మగట్ట మండలం 75 వీరాపురం వద్ద ప్రమాదం జరిగింది. ఆటో బోల్తా పడిన ఘటనలో కేపీ దొడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు మృతిచెందగా, ఓ మహిళతో పాటు ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. రాయదుర్గం నుంచి బయలుదేరిన ఆటోకు 75 వీరాపురం తండా వద్ద గెదే అడ్డు వచ్చింది. దానిని తప్పించే క్రమంలో బోల్తా పడింది. ఈ ఘటనలో కేపీదొడ్డి గ్రామానికి చెందిన శివమ్మ, లక్ష్మీదేవి అనే మహిళలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. గుమ్మగట్ట పోలీసులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: Murder: స్టాఫ్​నర్స్​, మెడికల్​ రిప్​ క్రైం లవ్​స్టోరీ.. సినిమా స్టైల్​లో ప్లాన్​ వేశాడు కానీ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.