ETV Bharat / state

ట్రాన్స్​ఫార్మర్ కోసం లంచం తీసుకున్న ఏడీఈ.. వీడియో తీసిన రైతులు!

అనంతపురం జిల్లా గుంతకల్లులో ట్రాన్స్​ ఫార్మర్ మంజూరు కోసం ట్రాన్స్​ కో ఏడీఈ రవిబాబు రైతుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు ఉన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని రవిబాబు చెబుతున్నాడు.

author img

By

Published : Dec 7, 2020, 5:53 PM IST

ట్రాన్స్​ఫార్మర్ కోసం లంచం తీసుకున్న ఏడీఈ .. వీడియో తీసిన రైతులు!
ట్రాన్స్​ఫార్మర్ కోసం లంచం తీసుకున్న ఏడీఈ .. వీడియో తీసిన రైతులు!
ట్రాన్స్​ఫార్మర్ కోసం లంచం తీసుకున్న ఏడీఈ.. వీడియో తీసిన రైతులు!

గుంతకల్లులో ట్రాన్స్​ఫార్మర్ మంజూరు కోసం ట్రాన్స్​కో ఏడీఈ రవిబాబు రైతుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు ఓ వీడియో బయటకొచ్చింది. లైన్​మెన్ ద్వారా రవిబాబుకు లక్షన్నర లంచం ఇచ్చిన ఇద్దరు రైతులు ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా చరవాణిలో చిత్రీకరించారు. రవిబాబు ఈ డబ్బును గుంతకల్లు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో తాను నివాసం ఉండే ఇంట్లో ఓ లైన్ మెన్ మధ్యవర్తిగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో విద్యుత్ శాఖలో సంచలనంగా మారింది.

ఈ విషయంపై రవిబాబును వివరణ కోరగా.. ఇదంతా అవాస్తవమని, తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని చెప్పారు. తాను రైతులకు అప్పుగా ఇచ్చానని చెప్పడంతో ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు చేపడతామని.. ఇకపై ట్రాన్స్​ఫార్మర్ మంజూరులో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా తామే పర్యవేక్షణ చేపడతామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: 'ఏలూరు ఘటనపై అధ్యయనానికి ముగ్గురు సభ్యుల కేంద్ర కమిటీ'

ట్రాన్స్​ఫార్మర్ కోసం లంచం తీసుకున్న ఏడీఈ.. వీడియో తీసిన రైతులు!

గుంతకల్లులో ట్రాన్స్​ఫార్మర్ మంజూరు కోసం ట్రాన్స్​కో ఏడీఈ రవిబాబు రైతుల దగ్గర డబ్బులు తీసుకుంటున్నట్లు ఓ వీడియో బయటకొచ్చింది. లైన్​మెన్ ద్వారా రవిబాబుకు లక్షన్నర లంచం ఇచ్చిన ఇద్దరు రైతులు ఈ మొత్తం వ్యవహారాన్ని రహస్యంగా చరవాణిలో చిత్రీకరించారు. రవిబాబు ఈ డబ్బును గుంతకల్లు పట్టణంలోని హౌసింగ్ బోర్డులో తాను నివాసం ఉండే ఇంట్లో ఓ లైన్ మెన్ మధ్యవర్తిగా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో విద్యుత్ శాఖలో సంచలనంగా మారింది.

ఈ విషయంపై రవిబాబును వివరణ కోరగా.. ఇదంతా అవాస్తవమని, తాను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని చెప్పారు. తాను రైతులకు అప్పుగా ఇచ్చానని చెప్పడంతో ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టి చర్యలు చేపడతామని.. ఇకపై ట్రాన్స్​ఫార్మర్ మంజూరులో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా తామే పర్యవేక్షణ చేపడతామని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి: 'ఏలూరు ఘటనపై అధ్యయనానికి ముగ్గురు సభ్యుల కేంద్ర కమిటీ'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.