ETV Bharat / state

ధర్మవరం శాంతినగర్​లో ఉద్రిక్తత....

author img

By

Published : Sep 30, 2019, 11:46 PM IST

అనంతపురం జిల్లా శాంతినగర్​లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇళ్లను తొలగించటానికి వచ్చిన మున్సిపల్ అధికారులకు వ్యతిరేకంగా స్థానిక మహిళలు ఆందోళనలు చేశారు. పరిస్థితిని అదుపుచేసేందుకు వచ్చిన పోలీసులపై మహిళలు తిరగబడ్డారు.

ధర్మవరం శాంతినగర్​లో ఉద్రిక్తత....

ధర్మవరం శాంతినగర్​లో ఉద్రిక్తత....

అనంతపురం జిల్లా ధర్మవరం శాంతినగర్లో మున్సిపల్ అధికారులు ఇళ్ల తొలగించటానికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అనుమతులు లేకుండా 60 అడుగుల రహదారిలో గృహాలను నిర్మించారని వాటిని తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ సంఘటనా స్థలానికి వచ్చి తెలిపారు. ఈ దశలో ఆగ్రహించిన స్థానికులు ఇళ్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. భాజపా సీపీఐ(ఎం) జనసేన నాయకులు అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులు మోహరించి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు నిర్మాణాలు తొలగించకుండా మహిళలు బైఠాయించారు. వారిని అక్కడ నుంచి బలవంతంగా లాక్కెళ్తుండగా పోలీసులపై తిరగబడ్డారు. స్థానికులు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

ధర్మవరం శాంతినగర్​లో ఉద్రిక్తత....

అనంతపురం జిల్లా ధర్మవరం శాంతినగర్లో మున్సిపల్ అధికారులు ఇళ్ల తొలగించటానికి రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అనుమతులు లేకుండా 60 అడుగుల రహదారిలో గృహాలను నిర్మించారని వాటిని తొలగిస్తామని మున్సిపల్ కమిషనర్ భాను ప్రతాప్ సంఘటనా స్థలానికి వచ్చి తెలిపారు. ఈ దశలో ఆగ్రహించిన స్థానికులు ఇళ్ల తొలగింపును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగారు. భాజపా సీపీఐ(ఎం) జనసేన నాయకులు అక్కడికి చేరుకున్నారు. భారీగా పోలీసులు మోహరించి నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​కు తరలించారు నిర్మాణాలు తొలగించకుండా మహిళలు బైఠాయించారు. వారిని అక్కడ నుంచి బలవంతంగా లాక్కెళ్తుండగా పోలీసులపై తిరగబడ్డారు. స్థానికులు రాళ్లతో దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది.

ఇవీ చదవండి

ఇస్మార్ట్ శంకర్ డైలాగ్స్​తో రెచ్చిపోయిన దొంగ

Intro:సెంటర్:తణుకు, జిల్లా:పశ్చిమగోదావరి
రిపోర్టర్:ఎం. వెంకటేశ్వరరావు
ఫోన్: 93944 50286

AP_TPG_11_30_DUVVA_DANESWARI_AS_BALATHRIPURASUNDARI_AV_AP10092
(. ) శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండోరోజు పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం గ్రామంలో వేంచేసియున్న అమ్మవారు బాలా త్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిస్తూ భక్తులకు కనువిందు చేస్తున్నారు.


Body:అభయ, వరద హస్తాలతో పాటు మిగిలిన చేతుల్లో పుస్తకము, జపమాల ధరించి అమ్మవారు భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. బాలాత్రిపురసుందరి అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే జ్ఞానాన్ని, శాంతిని, ఆశీస్సులను ప్రసాదించడం తోపాటు కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతారు. ఉదయం నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరిస్తున్నారు.


Conclusion:దేవస్థాన పాలక వర్గం అధికారులు భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.