ETV Bharat / state

'పేదలు, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి'

author img

By

Published : May 7, 2020, 7:07 PM IST

అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో తెదేపా మద్దతుదారులు 12 గంటల పాటు నిరాహారదీక్ష చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలను, రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

కరోనా కష్టకాలంలో పేదలను, రైతులను ఆదుకోవాలని కోరుతూ... అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో తెదేపా మద్దతుదారులు 12 గంటల పాటు నిరాహారదీక్ష చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా చినీ, అరటి, వరి రైతులను ఆదుకోవాలన్నారు. మూసేసిన అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాకు 24 గంటల్లో అడ్డుకట్ట వేయాలన్నారు. లేకపోతే... రోడ్డుపై బైఠాయించి భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని తెదేపా నాయకులు హెచ్చరించారు. లాక్​డౌన్​ను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇసుక అక్రమ దందాతో భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.

కరోనా కష్టకాలంలో పేదలను, రైతులను ఆదుకోవాలని కోరుతూ... అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో తెదేపా మద్దతుదారులు 12 గంటల పాటు నిరాహారదీక్ష చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా చినీ, అరటి, వరి రైతులను ఆదుకోవాలన్నారు. మూసేసిన అన్న క్యాంటీన్లను వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో ఇసుక అక్రమ రవాణాకు 24 గంటల్లో అడ్డుకట్ట వేయాలన్నారు. లేకపోతే... రోడ్డుపై బైఠాయించి భారీ ఎత్తున నిరసన వ్యక్తం చేస్తామని తెదేపా నాయకులు హెచ్చరించారు. లాక్​డౌన్​ను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఇసుక అక్రమ దందాతో భారీ ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.