ETV Bharat / state

దేవాలయాలపై దాడులను ఖండిస్తూ తెదేపా నిరసన

author img

By

Published : Sep 16, 2020, 5:35 PM IST

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు నిరసనగా తెదేపా నిరసన చేపట్టింది. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో ఆరాచక పాలన కొనసాగుతోందని నాయకులు మండిపడ్డారు.

tdp protest at the state
దేవాలయాలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ తెదేపా నిరసన

అనంతపురం జిల్లాలో..

మడకశిర పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో తేదేపా ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వానికి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని దండం పెట్టి నిరసన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రత్యేకించి హిందూ దేవాలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ విషయంలో హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని వాపోయారు. అంతర్వేది ఘటన మరువక ముందే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి రథంలో సింహాలు మాయమవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని దేవాలయాలను సంరక్షించాలని కోరారు.

కల్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి తెదేపా నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి.. అయ్యప్ప ఆలయం ముందు నిరసన చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో గూండాల పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో మూడు సింహాలు మాయంపై తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు మండిపడ్డారు.

నెల్లూరు జిల్లాలో..
నాయుడుపేట పిళ్లారగుడిలో తెదేపా సీనియర్ నాయకులు పూజలు చేశారు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు ఆలయాలపై జరుగుతున్న దాడులపై నిరసన చేశారు. అంతర్వేది ఘటన నిగ్గు తేల్చాలని మాజీ ఎంపీ డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లాలో..
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు రాజేష్ ఆధ్వర్యంలో తెదేపా నేతలు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మనసు మార్చుకుని దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, తెలుగు యువత కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి. 'సింహం ప్రతిమలు అదృశ్యం కావడం దారుణం'

అనంతపురం జిల్లాలో..

మడకశిర పట్టణంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో తేదేపా ఎమ్మెల్సీ తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న, తెదేపా నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకాపా ప్రభుత్వానికి భగవంతుడు మంచి బుద్ధి ప్రసాదించాలని దండం పెట్టి నిరసన వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటినుంచి రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు. ప్రత్యేకించి హిందూ దేవాలయాలు, వాటి ఆస్తుల పరిరక్షణ విషయంలో హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని వాపోయారు. అంతర్వేది ఘటన మరువక ముందే ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న అమ్మవారి రథంలో సింహాలు మాయమవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని దేవాలయాలను సంరక్షించాలని కోరారు.

కల్యాణదుర్గం ఎన్టీఆర్ భవన్ నుంచి తెదేపా నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి.. అయ్యప్ప ఆలయం ముందు నిరసన చేపట్టారు. ప్రస్తుతం రాష్ట్రంలో గూండాల పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో మూడు సింహాలు మాయంపై తెదేపా నేత ఉమామహేశ్వర నాయుడు మండిపడ్డారు.

నెల్లూరు జిల్లాలో..
నాయుడుపేట పిళ్లారగుడిలో తెదేపా సీనియర్ నాయకులు పూజలు చేశారు. మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు ఆలయాలపై జరుగుతున్న దాడులపై నిరసన చేశారు. అంతర్వేది ఘటన నిగ్గు తేల్చాలని మాజీ ఎంపీ డిమాండ్ చేశారు.

విశాఖ జిల్లాలో..
రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ మేరకు మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తనయుడు రాజేష్ ఆధ్వర్యంలో తెదేపా నేతలు అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మనసు మార్చుకుని దేవాలయాలపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, తెలుగు యువత కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి. 'సింహం ప్రతిమలు అదృశ్యం కావడం దారుణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.