సంధ్య వేళలో శివయ్యకు సూర్య కిరణాభిషేకం - శివలింగాన్ని తాకిన సూర్యకిరణాలు
అనంతపురం జిల్లా శెట్టూరు మండలం అయ్యగార్లపల్లిలోని శైవక్షేత్రంలో శివ లింగాన్ని... సాయంసంధ్య వేళలో సూర్యుడి కిరణాలు తాకాయి. ప్రత్యేకించి శివరాత్రి రోజున శివలింగంపై సూర్యకిరణాలు పడటం వల్ల స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఈ గ్రామం కర్ణాటక సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల కర్ణాటక నుంచి కూడా భక్తులు తరలివచ్చారు.