ETV Bharat / state

ఎరువుల దుకాణంలో చోరీ.. విలువైన వస్తువులు, నగదు మాయం - ఉరవకొండ తాజా వార్తలు

అనంతపురం జిల్లా ఉరవకొండలోని ఓ ఎరువుల దుకాణంలో చోరీ జరిగింది. దుకాణం పైకప్పు రేకులను కోసి లోపలికి ప్రవేశించిన దుండగులు నగదు, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. గతంలోనూ ఇదే తరహా చోరీ ఓ మొబైల్ షాపులో జరిగినట్టు స్థానికులు చెప్పారు.

robbery in vuravakonda fertilizer shop
చోరీ జరిగిన ఎరువుల దుకాణం
author img

By

Published : Sep 3, 2020, 10:57 PM IST

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఆర్టీసి డిపో ఎదురుగా ఉన్న విజయలక్ష్మి ఎరువుల దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం పైఉన్న ఇనుపరేకును కోసి లోపలికి ప్రవేశించి డబ్బులు, పలు విలువైన వస్తువులు దొంగలించినట్లు దుకాణం యజమాని వన్నూరు స్వామి తెలిపారు.

రెండు రోజులు దుకాణం మూసివేసిన యజమాని… ఉదయం వెళ్లి చూడగానే రేకులు కోసి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గతంలోనూ ఇదే తరహా దొంగతనం పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో మొబైల్ షాప్​లో జరిగింది. ఈ చోరీలు ఒకరే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో ఆర్టీసి డిపో ఎదురుగా ఉన్న విజయలక్ష్మి ఎరువుల దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. దుకాణం పైఉన్న ఇనుపరేకును కోసి లోపలికి ప్రవేశించి డబ్బులు, పలు విలువైన వస్తువులు దొంగలించినట్లు దుకాణం యజమాని వన్నూరు స్వామి తెలిపారు.

రెండు రోజులు దుకాణం మూసివేసిన యజమాని… ఉదయం వెళ్లి చూడగానే రేకులు కోసి ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. గతంలోనూ ఇదే తరహా దొంగతనం పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో మొబైల్ షాప్​లో జరిగింది. ఈ చోరీలు ఒకరే చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:

మరో 10,199 పాజిటివ్ కేసులు.. కోలుకున్న 9,499 మంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.