ETV Bharat / state

కల్వర్టును ఢీకొని కారు బోల్తా.. ఒకరు మృతి - కొట్టాల వద్ద రోడ్డు ప్రమాదం వార్తలు

కల్వర్టును ఢీకొని కారు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కొట్టాల వద్ద జరిగింది. మృతుడు చిత్తూరు జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో మృతుని భార్య తీవ్రంగా గాయపడ్డారు.

road accident in kottala ananthapuram district
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తి
author img

By

Published : Aug 24, 2020, 5:44 PM IST

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఎంఎస్​పీ కొట్టాల వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన బాలాజీ, అతని భార్య కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న కుమారుడిని చూసేందుకు వెళ్తున్నారు. కొట్టాల వద్దకు రాగానే రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొని కారు బోల్తాపడింది. ఈ ఘటనలో బాలాజీ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని భార్య తీవ్రంగా గాయపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని కదిరి ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద లభించిన నగదు, బంగారు ఆభరణాలను అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం ఎంఎస్​పీ కొట్టాల వద్ద జాతీయ రహదారిపై కారు బోల్తాపడిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన బాలాజీ, అతని భార్య కర్ణాటకలోని బళ్లారిలో ఉన్న కుమారుడిని చూసేందుకు వెళ్తున్నారు. కొట్టాల వద్దకు రాగానే రహదారి పక్కన ఉన్న కల్వర్టును ఢీకొని కారు బోల్తాపడింది. ఈ ఘటనలో బాలాజీ అక్కడికక్కడే మృతిచెందగా.. అతని భార్య తీవ్రంగా గాయపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రురాలిని కదిరి ఆసుపత్రికి తరలించారు. మృతుని వద్ద లభించిన నగదు, బంగారు ఆభరణాలను అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

పట్టణాల్లోనే కాదు.. పల్లెల్లోనూ కరోనా వ్యాప్తి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.