ETV Bharat / state

అదుపు తప్పి కారు బోల్తా.. నలుగురికి తీవ్ర గాయాలు

అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో 44వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి.

author img

By

Published : Jul 4, 2020, 4:04 PM IST

Road accident in Gutthi ananthapuram district.. Four men injured
రోడ్డు ప్రమాదానికి గురైన కారును తొలగిస్తున్న సిబ్బంది

బెంగళూరు నుంచి హైదరాబాద్​కు వస్తున్న ఓ కారు.. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు.. అదుపుతప్పి విభాగినిని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను కర్నూలుకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ల సహాయంతో కారును తొలగించి ట్రాఫిక్​ను క్రమబద్దీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బెంగళూరు నుంచి హైదరాబాద్​కు వస్తున్న ఓ కారు.. అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో ప్రమాదానికి గురైంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు.. అదుపుతప్పి విభాగినిని ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురికి గాయలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను కర్నూలుకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ల సహాయంతో కారును తొలగించి ట్రాఫిక్​ను క్రమబద్దీకరించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి.

పాచిపెంటలో 2.8 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.