ETV Bharat / state

తండ్రితో నామపత్రాలు దాఖలు చేయించి.. తనువు చాలించాడు! - penukonda road accident

తండ్రిని ఊరి సర్పంచ్​గా నిలబెట్టాలనుకున్నాడు ఓ కుమారుడు. ఆయన వెన్నంటే ఉంటూ.. దగ్గరుండి నామినేషన్ పనులను పూర్తి​ చేయించాడు. కానీ ఆ కోరిక తీరకుండానే.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

road accident
తండ్రితో నామపత్రలను దాఖలు చేయించి తనువు చాలించాడు
author img

By

Published : Feb 11, 2021, 5:35 PM IST

అనంతపురం జిల్లా మడకశిర మండలం మెళవాయి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెదేపా మద్దతుదారుడిగా ముద్ద రంగప్ప నిన్న నామినేషన్​ దాఖలు చేశారు. ఈ ప్రక్రియ మెుత్తం ఆయన కుమారుడు ఉమేష్ దగ్గరుండి చూసుకున్నారు.​ అనంతరం ఉమేష్​ తన స్వగ్రామం పెనుకొండకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.

ఈ సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టటంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న పార్థివ దేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

అనంతపురం జిల్లా మడకశిర మండలం మెళవాయి గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా తెదేపా మద్దతుదారుడిగా ముద్ద రంగప్ప నిన్న నామినేషన్​ దాఖలు చేశారు. ఈ ప్రక్రియ మెుత్తం ఆయన కుమారుడు ఉమేష్ దగ్గరుండి చూసుకున్నారు.​ అనంతరం ఉమేష్​ తన స్వగ్రామం పెనుకొండకు ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు.

ఈ సమయంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టటంతో అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే ఈరన్న పార్థివ దేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఇదీ చదవండి:

ఈ స్మగ్లర్ల తెలివి చూసి ఆశ్చర్య పోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.