ETV Bharat / state

అనంత జిల్లాలో వర్షం.. అన్నదాతల్లో ఆనందం

అనంతపురం జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలు కుంటలు, చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతోంది.

author img

By

Published : Sep 19, 2019, 10:14 PM IST

వర్షాలు
అనంత జిల్లాలో వర్షం

అనంతపురం జిల్లా తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న నేపథ్యంలో... మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. నార్పల ప్రాంతంలో మంగళవారం ఒక్క రోజే 13సెంటీమీటర్ల వర్షం కురవగా.. బుధవారం రాత్రి వజ్రకరూరులో 9సెంమీల వర్షం నమోదైంది. జిల్లాలో ఈ సారి ఖరీఫ్ సీజన్​ వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సెప్టెంబర్ 18 వరకు జిల్లాలో 209 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఇప్పటివరకు 26 శాతం వర్షపాతం లోటు నమోదైంది. గుత్తిలో 8సెంమీలు, బ్రహ్మసముద్రంలో 7 సెంటీమీటర్లు, శెట్టూరులో 4 సెంటీమీటర్లు, ధర్మవరంలో 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు నమోదవుతుండగా, పరిగి మండలంలో అత్యధిక లోటు కొనసాగుతోంది. పెద్దపప్పూరు, రాయదుర్గం, అగళి, రొద్దం లాంటి 10 మండలాల్లో 60 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైంది.

అనంత జిల్లాలో వర్షం

అనంతపురం జిల్లా తీవ్ర వర్షాభావంతో అల్లాడుతున్న నేపథ్యంలో... మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు రైతులకు ఊరటనిచ్చాయి. పలు ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. నార్పల ప్రాంతంలో మంగళవారం ఒక్క రోజే 13సెంటీమీటర్ల వర్షం కురవగా.. బుధవారం రాత్రి వజ్రకరూరులో 9సెంమీల వర్షం నమోదైంది. జిల్లాలో ఈ సారి ఖరీఫ్ సీజన్​ వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. సెప్టెంబర్ 18 వరకు జిల్లాలో 209 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా.. ఇప్పటివరకు 26 శాతం వర్షపాతం లోటు నమోదైంది. గుత్తిలో 8సెంమీలు, బ్రహ్మసముద్రంలో 7 సెంటీమీటర్లు, శెట్టూరులో 4 సెంటీమీటర్లు, ధర్మవరంలో 10 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు నమోదవుతుండగా, పరిగి మండలంలో అత్యధిక లోటు కొనసాగుతోంది. పెద్దపప్పూరు, రాయదుర్గం, అగళి, రొద్దం లాంటి 10 మండలాల్లో 60 శాతానికి పైగా వర్షపాతం లోటు నమోదైంది.

ఇది కూడా చదవండి

భాజపా ఆధ్వర్యంలో.. ఉచిత వైద్య శిబిరం

Intro:Ap_vsp47_gvmc_jonal_comiwhner_badyatalu_ab_AP10077_k. Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి జీవీఎంసీ జోనల్ కమిషనర్ గా శ్రీరామ్మూర్తి బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ చేసిన రామచంద్ర రావు కి విశాఖపట్నం ప్రధాన కార్యాలయం కి బదిలీ అయింది
ఇతని స్థానంలో గిరిజన కార్పొరేషన్ సంయుక్త సంచాలకులు గా పనిచేస్తున్న శ్రీరామ్మూర్తి అనకాపల్లి జోనల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు
Body:అనకాపల్లి పట్టణ ప్రజలకు జీవీఎంసీ పరంగా మెరుగైన సేవలు అందిస్తామని పేర్కొన్నారు అంతకుముందు జోనల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన శ్రీరామ్మూర్తి అనకాపల్లి నూకాలమ్మ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారుConclusion:బైట్1 శ్రీరామ్మూర్తి అనకాపల్లి జోనల్ కమిషనర్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.