ETV Bharat / state

విద్యుదాఘాతంతో ప్రైవేటు ఎలక్ట్రీషియన్​ మృతి - private electrician died in ananthapur district latest news

చీకులగురికి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్​ స్తంభంపై మరమ్మతులు చేస్తున్న ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్​ విద్యుదాఘాతంతో కింద పడి మృతి చెందాడు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు.

person died due to electric shock in chikulaguriki village
విద్యుదాఘాతం జరిగి విద్యుత్​ స్తంభం మీద నుంచి పడి వ్యక్తి మృతి
author img

By

Published : Aug 10, 2020, 11:11 PM IST

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకులగురికి గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్​ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి చెన్నప్పగా గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో చిన్న చిన్న విద్యుత్​ మరమ్మతులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఎప్పటిలానే ఓ ఇంట్లో విద్యుత్​ సరఫరా లేదని మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. 11 కేవీ లైన్​ ఒకటి ఆపి... మరొకటి ఆపకుండా విద్యుత్​ స్తంభం ఎక్కి మరమ్మతులు చేశాడు. ఆ సమయంలో విద్యుదాఘాతం జరిగి పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నప్పకు ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పాల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం చీకులగురికి గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ ప్రైవేటు ఎలక్ట్రీషియన్​ మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి చెన్నప్పగా గ్రామస్థులు తెలిపారు. గ్రామంలో చిన్న చిన్న విద్యుత్​ మరమ్మతులు చేస్తూ జీవనం సాగించేవాడు. ఎప్పటిలానే ఓ ఇంట్లో విద్యుత్​ సరఫరా లేదని మరమ్మతులు చేసేందుకు వెళ్లాడు. 11 కేవీ లైన్​ ఒకటి ఆపి... మరొకటి ఆపకుండా విద్యుత్​ స్తంభం ఎక్కి మరమ్మతులు చేశాడు. ఆ సమయంలో విద్యుదాఘాతం జరిగి పైనుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నప్పకు ఇద్దరు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్ట్​మార్టం నిమిత్తం ఉరవకొండ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పాల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి :

చిలకలూరిపేట పెట్రోల్‌ బంకులో కరెంట్ షాక్-ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.