ETV Bharat / state

తీరం దాటిన 'నివర్'... తీర ప్రాంతంలో అప్రమత్తం

author img

By

Published : Nov 26, 2020, 6:43 AM IST

Updated : Nov 26, 2020, 7:21 AM IST

నివర్‌ తుపాను పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటింది. అతి తీవ్ర తుపాను నుంచి తీవ్ర తుపానుగా మారింది. నిన్న రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 2.30 మధ్య తీరం దాటినట్లు అధికారులు తెలిపారు. నివర్ ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాలో అర్థరాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. నెల్లూరు, చిత్తూరు ,ప్రకాశం జిల్లాలకు అత్యవసర పరిస్థితులలో సహాయక చర్యల కోసం ముందస్తుగా 179 మంది సభ్యులతో కూడిన 5 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, 85 మంది సభ్యులతో కూడిన 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి.

nivar-cyclone
nivar-cyclone

తమిళనాడు, పుదుచ్చేరిలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘నివర్‌’ తుపాను తీరం దాటింది. పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటి అతితీవ్ర తుపాను నుంచి తీవ్రతుపానుగా మారింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను తీరం దాటక గంటకు 120-145 కి.మీల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చెన్నై సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. నివర్‌ తుపాన్‌ తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

కోస్తా, సీమలో భారీ వర్షాలు

తుపాను ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉన్నాయి. నెల్లూరుపై నివర్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండగా చిత్తూరులోనూ ఈదురుగాలులు, జల్లులతో కూడిన వర్షం కురిసింది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు సహాయక చర్యల కోసం 5ఎస్డీఆర్‌ఎప్‌, 4ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. ఇళ్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలివెళ్లాలని విపత్తలుశాఖ సూచించింది. చిత్తూరు జిల్లాలో తుపాను ప్రభావంపై అధికారులు అప్రమత్తం అయ్యారు. తూర్పు ప్రాంతాల్లో ప్రభావం ఉంటుందన్న అంచనాతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలో 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ సూచించింది. పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

తిరుమలలో విరిగిపడ్డ కొండ చరియలు..

నివర్‌ తుపాను కారణంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. తీవ్రంగా వీస్తున్న గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలుతున్నాయి. తిరుమల కనుమ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. హరిణి ప్రాంతంలో రహదారిపై బండ రాళ్లు పడ్డాయి. జేసీబీల సాయంతో అధికారులు బండరాళ్లను తొలగిస్తున్నారు. పాపవినాశనం రహదారిపై కూలిన వృక్షాలను అటవీ విభాగం తొలగించింది. మరోవైపు తుపాను దృష్ట్యా ఇవాళ నడవనున్న పలురైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది.

తీరం దాటిన 'నివర్'... తీర ప్రాంతంలో అప్రమత్తం

ఇదీ చదవండి: తీరం దాటిన 'నివర్​'.. పెనుగాలుల బీభత్సం

తమిళనాడు, పుదుచ్చేరిలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ‘నివర్‌’ తుపాను తీరం దాటింది. పుదుచ్చేరికి సమీపంలో తీరం దాటి అతితీవ్ర తుపాను నుంచి తీవ్రతుపానుగా మారింది. బుధవారం రాత్రి 11.30 గంటల నుంచి గురువారం తెల్లవారుజామున 2.30 గంటల మధ్య నివర్‌ తుపాను తీరం దాటినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే తుపాను ప్రభావంతో తమిళనాడులోని పలు ప్రాంతాలు, ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. తుపాను తీరం దాటక గంటకు 120-145 కి.మీల వేగంతో గాలులు వీచినట్లు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు చెన్నై సముద్ర తీర ప్రాంతాలు అల్లకల్లోలంగా మారాయి. నివర్‌ తుపాన్‌ తమిళనాడు, పుదుచ్చేరిలపై తీవ్ర ప్రభావం చూపనుంది.

కోస్తా, సీమలో భారీ వర్షాలు

తుపాను ప్రభావంతో చిత్తూరు, కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. మిగిలిన చోట్ల అక్కడక్కడ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు ఉన్నాయి. నెల్లూరుపై నివర్ తుపాను ప్రభావం ఎక్కువగా ఉండగా చిత్తూరులోనూ ఈదురుగాలులు, జల్లులతో కూడిన వర్షం కురిసింది. ఇప్పటికే నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు సహాయక చర్యల కోసం 5ఎస్డీఆర్‌ఎప్‌, 4ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు చేరుకున్నాయి. ఇళ్లు సురక్షితం కాకపోతే పునరావాస కేంద్రాలకు ప్రజలు తరలివెళ్లాలని విపత్తలుశాఖ సూచించింది. చిత్తూరు జిల్లాలో తుపాను ప్రభావంపై అధికారులు అప్రమత్తం అయ్యారు. తూర్పు ప్రాంతాల్లో ప్రభావం ఉంటుందన్న అంచనాతో ప్రత్యేక చర్యలు చేపట్టారు. సత్యవేడు నియోజకవర్గ పరిధిలో 340 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైతులు అప్రమత్తంగా ఉండి, పంట సంరక్షణకై తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల శాఖ సూచించింది. పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.

తిరుమలలో విరిగిపడ్డ కొండ చరియలు..

నివర్‌ తుపాను కారణంగా తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. తీవ్రంగా వీస్తున్న గాలులకు ఎక్కడికక్కడ చెట్లు నేలకూలుతున్నాయి. తిరుమల కనుమ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి. హరిణి ప్రాంతంలో రహదారిపై బండ రాళ్లు పడ్డాయి. జేసీబీల సాయంతో అధికారులు బండరాళ్లను తొలగిస్తున్నారు. పాపవినాశనం రహదారిపై కూలిన వృక్షాలను అటవీ విభాగం తొలగించింది. మరోవైపు తుపాను దృష్ట్యా ఇవాళ నడవనున్న పలురైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది.

తీరం దాటిన 'నివర్'... తీర ప్రాంతంలో అప్రమత్తం

ఇదీ చదవండి: తీరం దాటిన 'నివర్​'.. పెనుగాలుల బీభత్సం

Last Updated : Nov 26, 2020, 7:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.