అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో హాంద్రీనీవా కాలువపనులను ఎమ్మెల్యే తిప్పేస్వామి, ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ మల్లికార్జున పరిశీలించారు. చెరువులకు హంద్రీనీవా జలాలు నింపనున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు మడకశిర చెరువుకు చేరగా.. ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు మిగిలి ఉన్నాయి. వీటిలో అమరాపురం, అగళి రెండు మండలాలకు కృష్ణా జలాలు అందించేందుకు కాలువ పనుల్లో చిన్నపాటి పనులు మినహా మిగిలిన పనులన్నీ పూర్తయ్యాయి.
మరో పదిహేను రోజుల్లో ఈ రెండు మండలాలకు కాలువ ద్వారా నీరును పంపిస్తున్నారు. వచ్చే సంవత్సరం నియోజకవర్గంలోని అన్ని మండలాలో హంద్రీనీవా కాలువ పనులు పూర్తిచేస్తామని ఇంజినీర్ అన్నారు. నియోజకవర్గంలోని 230 చెరువులకు కృష్ణా జలాలు నింపుతామని ఆయన పేర్కొన్నారు.
ఇదీ చూడండి: