ETV Bharat / state

నష్టపోయిన రైతులను ఆదుకుంటాం: మంత్రి శంకరనారాయణ - నష్టపోయిన పంటలను పరిశీలించిన మంత్రి శంకరనారాయణ

తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటామని మంత్రి శంకర నారాయణ అన్నారు. వరద నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికార యంత్రాంగం ఉందని.. పూర్తిస్థాయి నివేదిక అందిన వెంటనే పరిహారం చెల్లిస్తామన్నారు.

minister sankara narayana
మంత్రి శంకరనారాయణ
author img

By

Published : Nov 29, 2020, 1:20 PM IST

నివర్ తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని.. రోడ్డు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం కె. కుంట్లపల్లి, అలంపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, గత ప్రభుత్వాలకు భిన్నంగా బకాయిపడ్డ పెట్టుబడి రాయితీ చెల్లిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైందన్నారు. పూర్తిస్థాయి నివేదిక అందిన వెంటనే వీలైనంత త్వరలో రైతులకు పరిహారం చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

నివర్ తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని.. రోడ్డు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ అన్నారు. అనంతపురం జిల్లా కదిరి మండలం కె. కుంట్లపల్లి, అలంపూర్ గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు.

తమ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, గత ప్రభుత్వాలకు భిన్నంగా బకాయిపడ్డ పెట్టుబడి రాయితీ చెల్లిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంట నష్టాన్ని అంచనా వేసే పనిలో అధికార యంత్రాంగం నిమగ్నమైందన్నారు. పూర్తిస్థాయి నివేదిక అందిన వెంటనే వీలైనంత త్వరలో రైతులకు పరిహారం చెల్లిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

ఇవీ చదవండి..

ముంచెత్తిన వరద... కడప నగరం బురద

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.