లారీ అదుపుతప్పి బోల్తా పడగా.. డ్రైవర్ తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతపురం జిల్లా గుత్తి శివార్లలోని 44వ జాతీయ రహదారిపై జరిగిందీ ఘటన. వాహనం నడుపుతుండగా ఫిట్స్ రావడమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. లారీ పొలాల్లోకి దూసుకెళ్లగా.. చోదకుడిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తరలిస్తున్నట్లు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ధర్మవరంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి