అనంతపురం జిల్లా మడకశిర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు కర్ణాటక మద్యం అమ్మకాలపై దాడులు నిర్వహించారు. మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలం ఆచార్యపాళ్యంలో మల్లప్ప అనే వ్యక్తిపై దాడి జరపగా.. బైక్పై తరలిస్తున్న 32 కర్ణాటక మద్యం ప్యాకెట్లు పట్టుబడింది.
మండలంలోని కేకాతి క్రాస్ వద్ద పల్లాలప్ప అనే వ్యక్తి ద్విచక్రవాహనంలో తరలిస్తున్న 212 మద్యం కర్ణాటక మద్యం ప్యాకెట్లను పట్టుకున్నారు. ఈ వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసి, మద్యం, బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు.
ఇదీ చదవండి: మరికాసేపట్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం