అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్ఈబీ పోలీసులు పట్టుకున్నారు. వెల్పమడుగు వద్ద తనిఖీలు చేస్తుండగా 48 మద్యం ప్యాకెట్లు తరలిస్తున్న ద్విచక్రవాహనాన్ని సీజ్ చేశారు. ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
పక్క రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని సీఐ శ్యాంప్రసాద్ తెలిపారు. ఎవరైనా ఇలాంటి అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి: