ETV Bharat / state

kalva srinivasulu criticized the government : 'తుంగభద్ర ఎగువ కాలువకు గండి.. పట్టించుకోని అధికారులు'

author img

By

Published : Aug 12, 2023, 6:40 PM IST

kalva srinivasulu criticized the government : అనంతపురం జిల్లాలో తుంగభద్ర ఎగువకాలువ కడి గట్టుకు గండి పడింది. గండి పడిన ప్రదేశాన్ని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు రైతులతో కలిసి పరిశీలించారు. నీరంతా వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు. ఎన్ని సార్లు అధికారులకు కాలువ మరమ్మతుల గురించి లేఖలు రాసిన పట్టించుకోవటం లేదని మండిపడ్డారు.

kalva srinivasulu criticized the government
kalva srinivasulu criticized the government

kalava srinivasulu criticized the government : అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్ వద్ద తుంగభద్ర ఎగువ కాలువ కుడి గట్టుకు గండిపడి. నీరంతా వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవటం లేదని టీడీపీ పోలీట్​ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గండి ప్రదేశాన్నిహెచ్​ఎల్​సీ ఆయకట్టు రైతులతో కలిసి పరిశీలించారు. జిల్లా ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలకు జీవనాధారమైన తుంగభద్ర ఎగువ కాలువకు కనీస మరమ్మతులు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. మరమ్మతుల కోసం ప్రభుత్వానికి, అధికారులకు పలుమార్లు లేఖలు రాసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులను కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదు అని విమర్శించారు.

Neglecting the repair work for Tungabhadra canal : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన.. హెచ్​ఎల్​సీకి ఆధునీకీకరణ పనులు పూర్తి చేయకపోవటం వల్ల ప్రతి ఏటా ఎక్కడో ఒకచోట కాలువకు గండి పడి నీరంతా వృధా అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. బొమ్మనహల్ మండలం ఉంతకల్ వద్ద గండిపడి నీరంతా వృధాగా బయటకు పోతున్నాయి. నీరు వృధా పోతున్న నాయకులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తాగు, సాగునీటి పైన శ్రద్ధ లేదన్నారు. హెచ్ఎల్​సీ మరమ్మతుల కోసం పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా కలెక్టర్ కు పలుమార్లు లేఖలు రాశామన్నారు. ఇలాంటి ఆత్యవసర మరమ్మతుల కోసం ప్రభుత్వం 20 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదు. ఇప్పుడు ఎగువ కాలువకు గండి పడి నీరంతా వృథా అవుతున్నాయని అన్నారు.

Farmers' Subscriptions for Canal Resurfacing Works: రైతుల చందాల సొమ్ముతో కాలువల పూడికతీత పనులు

"హెచ్​ఎల్​సీ కాలువ నుంచి నీరు తీసుకొని రైతులు పంటలను సాగు చేసుకుంటున్నారు. సాగు చేస్తున్న రైతుల దగ్గర నుంచి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎకరాకు సుమారు ఏడు నుంచి ఎనిమిది వేలు వసూలు చేస్తున్నారు. అయినప్పటీకి అక్రమ ఆదాయంపై ఉన్న శ్రద్ధ హెచ్​ఎల్​సీ మరమ్మతులు చేపించటం మీద లేదు. కాపు రామచంద్రారెడ్డి బాధ్యత లేని ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు. కమిషన్లు అక్రమ సంపాదనపై దృష్టి పెట్టడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టం. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి హెచ్ఎల్​సీ మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి." -కాల్వ శ్రీనివాసులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు

TDP Vs Tammineni Sitaram: తమ్మినేనిపై టీడీపీ ఫైర్​.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్​

kalva srinivasulu criticized the government : 'తుంగభద్ర ఎగువ కాలువకు గండి.. పట్టించుకోని అధికారులు'

kalava srinivasulu criticized the government : అనంతపురం జిల్లా బొమ్మనహాళ్‌ మండలం ఉంతకల్ వద్ద తుంగభద్ర ఎగువ కాలువ కుడి గట్టుకు గండిపడి. నీరంతా వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవటం లేదని టీడీపీ పోలీట్​ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. గండి ప్రదేశాన్నిహెచ్​ఎల్​సీ ఆయకట్టు రైతులతో కలిసి పరిశీలించారు. జిల్లా ప్రజలకు తాగు, సాగునీటి అవసరాలకు జీవనాధారమైన తుంగభద్ర ఎగువ కాలువకు కనీస మరమ్మతులు చేపట్టకపోవడం బాధాకరమన్నారు. మరమ్మతుల కోసం ప్రభుత్వానికి, అధికారులకు పలుమార్లు లేఖలు రాసిన పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. అత్యవసర మరమ్మతుల కోసం ప్రభుత్వం నిధులను కేటాయించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదు అని విమర్శించారు.

Neglecting the repair work for Tungabhadra canal : ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు పూర్తయిన.. హెచ్​ఎల్​సీకి ఆధునీకీకరణ పనులు పూర్తి చేయకపోవటం వల్ల ప్రతి ఏటా ఎక్కడో ఒకచోట కాలువకు గండి పడి నీరంతా వృధా అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. బొమ్మనహల్ మండలం ఉంతకల్ వద్ద గండిపడి నీరంతా వృధాగా బయటకు పోతున్నాయి. నీరు వృధా పోతున్న నాయకులు, అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. తాగు, సాగునీటి పైన శ్రద్ధ లేదన్నారు. హెచ్ఎల్​సీ మరమ్మతుల కోసం పలుమార్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, అనంతపురం జిల్లా కలెక్టర్ కు పలుమార్లు లేఖలు రాశామన్నారు. ఇలాంటి ఆత్యవసర మరమ్మతుల కోసం ప్రభుత్వం 20 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదు. ఇప్పుడు ఎగువ కాలువకు గండి పడి నీరంతా వృథా అవుతున్నాయని అన్నారు.

Farmers' Subscriptions for Canal Resurfacing Works: రైతుల చందాల సొమ్ముతో కాలువల పూడికతీత పనులు

"హెచ్​ఎల్​సీ కాలువ నుంచి నీరు తీసుకొని రైతులు పంటలను సాగు చేసుకుంటున్నారు. సాగు చేస్తున్న రైతుల దగ్గర నుంచి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఎకరాకు సుమారు ఏడు నుంచి ఎనిమిది వేలు వసూలు చేస్తున్నారు. అయినప్పటీకి అక్రమ ఆదాయంపై ఉన్న శ్రద్ధ హెచ్​ఎల్​సీ మరమ్మతులు చేపించటం మీద లేదు. కాపు రామచంద్రారెడ్డి బాధ్యత లేని ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నాడు. కమిషన్లు అక్రమ సంపాదనపై దృష్టి పెట్టడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టం. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించి హెచ్ఎల్​సీ మరమ్మతులు త్వరగా పూర్తి చేయాలి." -కాల్వ శ్రీనివాసులు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు

TDP Vs Tammineni Sitaram: తమ్మినేనిపై టీడీపీ ఫైర్​.. ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్​

kalva srinivasulu criticized the government : 'తుంగభద్ర ఎగువ కాలువకు గండి.. పట్టించుకోని అధికారులు'
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.