ETV Bharat / state

కదిరి గరుడ ఆంజనేయునికి పూర్వవైభవం

శిథిలావస్థకు చేరుకున్న ఆలయం, పాడుబడిపోయిన కోనేరు...ఇదీ కొన్ని రోజుల క్రితం కదిరి గరుడ ఆంజనేయస్వామి ఆలయం పరిస్థితి. ఆలయ పరిస్థితి తెలుసుకున్న కొందరు యువకులు పునరుద్ధరణ పనులు చేపట్టారు. శిథిలావస్థలోని ఆలయానికి పూర్వశోభను తెచ్చారు.

author img

By

Published : May 31, 2019, 7:37 AM IST

కదిరి గరుడ ఆంజనేయునికి పూర్వవైభవం
కదిరి గరుడ ఆంజనేయునికి పూర్వవైభవం
ఒకప్పుడు నిత్యం దీప-ధూపాలు, భక్తులతో సందడిగా ఉండే కదిరి గరుడ ఆంజనేయ స్వామి దేవాలయం దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతుంది. పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకుంది. గుడి ముందు భాగంలో ఉన్న కోనేరు ఎండిపోయి, వ్యర్థాలతో పూడిపోయింది. ఆలయ విశిష్టతను తెలుసుకున్న కొందరు యువకులు ఆలయ పునరుద్ధరణకు ముందుకొచ్చారు.

అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ గరుడ ఆంజనేయస్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. కదిరి సమీపంలోని మధ్య లేరు వాగు పక్కనున్న గరుడ ఆంజనేయస్వామి ఆలయం పరిసర భూముల ఆక్రమణలతో గురయ్యాయి. ఒకప్పుడు విశాలంగా ఉన్న ఈ ఆలయం ఆక్రమణలతో కుచించుకుపోయింది.

గుడి పరిస్థితిని తెలుసుకున్న శ్రీ ఖాద్రీ రక్షక దళ్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. యువకుల చొరవతో ఆలయ పరిసరాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. గుడి మొత్తం రంగులు వేయించి, ఆలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా కాషాయ ధ్వజాలను ఏర్పాటు చేశారు. మంగళ, శనివారాలు అంజనీపుత్రుడికు పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. గుడి పునరుద్ధరణతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరిగిందని స్థానికులు అంటున్నారు. యువకుల చొరవను అభినందిస్తున్నారు.


ఇవీ చూడండి : నవరత్నాలను అమలు చేస్తాం: సీఎం జగన్‌

కదిరి గరుడ ఆంజనేయునికి పూర్వవైభవం
ఒకప్పుడు నిత్యం దీప-ధూపాలు, భక్తులతో సందడిగా ఉండే కదిరి గరుడ ఆంజనేయ స్వామి దేవాలయం దేవాదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతుంది. పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరుకుంది. గుడి ముందు భాగంలో ఉన్న కోనేరు ఎండిపోయి, వ్యర్థాలతో పూడిపోయింది. ఆలయ విశిష్టతను తెలుసుకున్న కొందరు యువకులు ఆలయ పునరుద్ధరణకు ముందుకొచ్చారు.

అనంతపురం జిల్లా కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ గరుడ ఆంజనేయస్వామి ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. కదిరి సమీపంలోని మధ్య లేరు వాగు పక్కనున్న గరుడ ఆంజనేయస్వామి ఆలయం పరిసర భూముల ఆక్రమణలతో గురయ్యాయి. ఒకప్పుడు విశాలంగా ఉన్న ఈ ఆలయం ఆక్రమణలతో కుచించుకుపోయింది.

గుడి పరిస్థితిని తెలుసుకున్న శ్రీ ఖాద్రీ రక్షక దళ్ పునరుద్ధరణ పనులు చేపట్టారు. యువకుల చొరవతో ఆలయ పరిసరాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. గుడి మొత్తం రంగులు వేయించి, ఆలయ ఆవరణంలో మొక్కలు నాటారు. ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసేలా కాషాయ ధ్వజాలను ఏర్పాటు చేశారు. మంగళ, శనివారాలు అంజనీపుత్రుడికు పూజలు చేసేలా ఏర్పాట్లు చేశారు. గుడి పునరుద్ధరణతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య క్రమంగా పెరిగిందని స్థానికులు అంటున్నారు. యువకుల చొరవను అభినందిస్తున్నారు.


ఇవీ చూడండి : నవరత్నాలను అమలు చేస్తాం: సీఎం జగన్‌

New Delhi, May 30 (ANI): Prime Minister of Nepal KP Sharma Oli arrived in the national capital today to attend Prime Minister Narendra Modi's swearing-in ceremony at Rashtrapati Bhavan. Leaders of Bay of Bengal Initiative for Multi-Sectoral Technical and Economic Cooperation (BIMSTEC) have been invited for the oath taking ceremony of PM Modi. PM Modi is likely to take oath at 7pm today.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.