ETV Bharat / state

ఇంటర్ మార్కుల జాబితా గల్లంతుపై విచారణ

author img

By

Published : Oct 15, 2020, 12:18 PM IST

కళాశాలలో 137 మంది విద్యార్థులకు సంబంధించిన ఇంటర్ మార్కుల జాబితా గల్లంతుపై విచారణ ప్రారంభమైంది. ప్రస్తుతం చిన్న మార్కుల జాబితాను అందజేస్తామని వారంలోగా ఒరిజినల్స్ అందేలా చర్యలు తీసుకుంటామని డీఈఓ బాలప్ప తెలిపారు.

Government Junior College
మార్కుల జాబితా గల్లంతు పై విచారణ

ఇంటర్ మార్కుల జాబితా గల్లంతుపై విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం చిన్న మార్కుల జాబితా ఇస్తున్నామని... త్వరలో ఒరిజినల్స్ అందేలా చర్యలు తీసుకుంటామని డీఈఓ బాలప్ప తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్​లో... మార్కుల జాబితాలో గల్లంతుపై డీఈవో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ ప్రారంభించింది. విద్యార్థులకు చెందిన అడ్మిషన్లు, విద్యార్థుల వివరాలు, మార్కుల జాబితాలు తీసుకొని వచ్చే సమయంలో... పార్సెల్ మిస్సైందని... కళాశాల జూనియర్ సహాయకుడు జాకీర్ హుస్సేన్​ను విచారించారు.

బాలప్ప, కళాశాల జూనియర్ సహాయకుడు జాకీర్ హుస్సేన్ ను 137 మంది విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితా పార్సిల్ ను అనంతపురంలోని ఆర్ఐఓ కార్యాలయంలో సంతకం చేయించుకొని అప్పగించాలని చెప్పారు. అయితే ఆయన పార్సెల్ తీసుకొని వెళ్లే సమయంలో బస్టాండ్​లో మిస్ అయిందని, తనకు గుర్తుకు రావడం లేదని విచారణాధికారి వద్ద పేర్కొన్నాడు.

గల్లంతైన విషయం తమకు కూడా సమాచారం ఇవ్వక పోవటంతో....ఈ నెల 10వ తేదీన బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు తెలిపారు. బస్టాండ్ ఆవరణలోని సీసీ కెమెరాలు పరిశీలించామని అక్కడికి వెళ్లినట్లు రీకార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్ సహాయకుడుపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు.

ఇంటర్ బోర్డు అధికారులతో మాట్లాడి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా వారంలోగా ఒరిజినల్ మార్కుల జాబితా అందజేస్తామని ఆర్ ఐ ఓ వెంకటరమణ నాయుడు ఇంటర్ చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులకు చిన్న మార్కుల జాబితాలను ప్రిన్సిపాల్ వద్ద అందుబాటులో ఉంచామన్నారు. కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల్లో చేరే విద్యార్థులకు చిన్న మార్కుల జాబితాతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

ఇదీ చదవండీ...తీవ్రవాయుగుండంతో కోస్తాంధ్ర అతలాకుతలం

ఇంటర్ మార్కుల జాబితా గల్లంతుపై విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం చిన్న మార్కుల జాబితా ఇస్తున్నామని... త్వరలో ఒరిజినల్స్ అందేలా చర్యలు తీసుకుంటామని డీఈఓ బాలప్ప తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలోని బొమ్మనహల్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్​లో... మార్కుల జాబితాలో గల్లంతుపై డీఈవో ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం విచారణ ప్రారంభించింది. విద్యార్థులకు చెందిన అడ్మిషన్లు, విద్యార్థుల వివరాలు, మార్కుల జాబితాలు తీసుకొని వచ్చే సమయంలో... పార్సెల్ మిస్సైందని... కళాశాల జూనియర్ సహాయకుడు జాకీర్ హుస్సేన్​ను విచారించారు.

బాలప్ప, కళాశాల జూనియర్ సహాయకుడు జాకీర్ హుస్సేన్ ను 137 మంది విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితా పార్సిల్ ను అనంతపురంలోని ఆర్ఐఓ కార్యాలయంలో సంతకం చేయించుకొని అప్పగించాలని చెప్పారు. అయితే ఆయన పార్సెల్ తీసుకొని వెళ్లే సమయంలో బస్టాండ్​లో మిస్ అయిందని, తనకు గుర్తుకు రావడం లేదని విచారణాధికారి వద్ద పేర్కొన్నాడు.

గల్లంతైన విషయం తమకు కూడా సమాచారం ఇవ్వక పోవటంతో....ఈ నెల 10వ తేదీన బొమ్మనహాళ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఆంజనేయులు తెలిపారు. బస్టాండ్ ఆవరణలోని సీసీ కెమెరాలు పరిశీలించామని అక్కడికి వెళ్లినట్లు రీకార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన జూనియర్ సహాయకుడుపై శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు నివేదికలు పంపుతున్నట్లు తెలిపారు.

ఇంటర్ బోర్డు అధికారులతో మాట్లాడి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా వారంలోగా ఒరిజినల్ మార్కుల జాబితా అందజేస్తామని ఆర్ ఐ ఓ వెంకటరమణ నాయుడు ఇంటర్ చెప్పారు. ప్రస్తుతం విద్యార్థులకు చిన్న మార్కుల జాబితాలను ప్రిన్సిపాల్ వద్ద అందుబాటులో ఉంచామన్నారు. కర్ణాటక , తమిళనాడు రాష్ట్రాల్లో చేరే విద్యార్థులకు చిన్న మార్కుల జాబితాతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు.

ఇదీ చదవండీ...తీవ్రవాయుగుండంతో కోస్తాంధ్ర అతలాకుతలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.