అనంతపురం జిల్లా కదిరి మండలం కాలసముద్రం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం కదిరి ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. గురుకుల పాఠశాలలో చరవాణి అదృశ్యమైన ఘటనలో అధ్యాపకులు వీరిని మందలించినట్లు సమాచారం. ఈ నేపధ్యంలో ఇద్దరు విద్యార్దులు అస్వస్థతకు గురవడం అనుమానాలకు తావు ఇస్తోంది. అధ్యాపకులు కొట్టడం వల్లే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇది కాక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పాఠశాల అధికార్లు విచారణ చేస్తున్నారు.
ఇదీచదవండి