ETV Bharat / state

వైసీపీ ఎమ్మెల్సీ కొడుకునంటూ.. రూ.28లక్షలు కాజేసిన కేటుగాడు

Fraud by taking money from friends: "తాను వైసీపీ ఎమ్మెల్సీ కొడుకునని.. రాబోయే రోజుల్లో హైదరాబాద్​ నగర అధ్యక్షుడ్ని" అని చెప్పుకొని ఫ్రెండ్స్​ దగ్గర డబ్బులు తీసుకొని.. చివరకు ఎగనామం పెట్టే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్​లోని ఎస్సార్​నగర్​లో జరిగిన ఈ ఘటనలో.. పోలీసులు వాస్తవాలు వెలికితీసే పనిలో పడ్డారు.

author img

By

Published : Jan 5, 2023, 4:25 PM IST

Fraud by taking money from friends
వైసీపీ ఎమ్మెల్సీ కొడుకునంటూ మోసం

Fraud by taking money from friends: వైసీపీ తన తండ్రి అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్సీ అని, తాను వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్‌ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహకుడి వద్ద రూ.28 లక్షల మేర స్వాహా చేశాడో తెలంగాణకు చెందిన ఓ యువకుడు. హైదరాబాద్​లోని ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యవంశీ ప్రకాష్‌(28) అనే వ్యక్తి అమీర్‌పేటలో జీపీఎస్‌ ఇన్ఫోటెక్‌ అనే సంస్థ నిర్వహిస్తున్నాడు. గతేడాది జులైలో కార్తిక్‌రెడ్డి(30) అనే వ్యక్తి సూర్యవంశీని కలిశాడు.

Fraud by taking money from friends
వైసీపీ ఎమ్మెల్సీ కొడుకునంటూ మోసం

తన తండ్రి రామ్మోహన్‌రెడ్డి ఏపీలో ఎమ్మెల్సీ అని, తాను కాబోయే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నగర అధ్యక్షుడినని చెప్పుకున్నాడు. జీపీఎస్‌ ఇన్ఫోటెక్‌ కార్యాలయంలో తనకు కొంత భాగం అద్దెకివ్వాలని కోరాడు. అంగీకరించిన సూర్యవంశీ ప్రకాష్‌ రూ.40వేలు ధరావతు, నెలకు రూ.15వేల చొప్పున తన కార్యాలయంలోని కొంత భాగం అద్దెకిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇదే అదనుగా తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి ఒకసారి సూర్యవంశీ వద్ద రూ.86వేలు అప్పుగా తీసుకున్నాడు. మరోసారి కార్తిక్‌రెడ్డి తండ్రిగా చెప్పిన రామ్మోహన్‌రెడ్డి పేరిట మరో వ్యక్తి సూర్యవంశీతో ఫోన్‌లో మాట్లాడాడు.

తాను ఎమ్మెల్సీనని, ఏపీ, తెలంగాణలో చాలా ఆస్తులున్నాయని చెప్పాడు. అత్యవసరంగా నగదు అవసరమని చెప్పడంతో విడతలవారీగా రూ.26లక్షల 95 వేలు కార్తిక్‌రెడ్డికి ముట్టచెప్పాడు. తర్వాత తీసుకున్న అప్పు ఎంతకూ తిరిగివ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు కార్తిక్‌రెడ్డి గురించి ఆరా తీశాడు. కార్తిక్‌రెడ్డి అమీర్‌పేటలోని అంకమ్మబస్తీ నివాసి అని, అతనితోపాటు అతని కుటుంబ సభ్యులు ఇదే తరహా మోసాలకు పాల్పడుతుంటారని గుర్తించాడు. మంగళవారం ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

Fraud by taking money from friends: వైసీపీ తన తండ్రి అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్సీ అని, తాను వైఎస్సార్‌ తెలంగాణ పార్టీకి కాబోయే హైదరాబాద్‌ నగర అధ్యక్షుడినని నమ్మించి ఓ ఐటీ సంస్థ నిర్వాహకుడి వద్ద రూ.28 లక్షల మేర స్వాహా చేశాడో తెలంగాణకు చెందిన ఓ యువకుడు. హైదరాబాద్​లోని ఎస్సార్‌నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యవంశీ ప్రకాష్‌(28) అనే వ్యక్తి అమీర్‌పేటలో జీపీఎస్‌ ఇన్ఫోటెక్‌ అనే సంస్థ నిర్వహిస్తున్నాడు. గతేడాది జులైలో కార్తిక్‌రెడ్డి(30) అనే వ్యక్తి సూర్యవంశీని కలిశాడు.

Fraud by taking money from friends
వైసీపీ ఎమ్మెల్సీ కొడుకునంటూ మోసం

తన తండ్రి రామ్మోహన్‌రెడ్డి ఏపీలో ఎమ్మెల్సీ అని, తాను కాబోయే వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ నగర అధ్యక్షుడినని చెప్పుకున్నాడు. జీపీఎస్‌ ఇన్ఫోటెక్‌ కార్యాలయంలో తనకు కొంత భాగం అద్దెకివ్వాలని కోరాడు. అంగీకరించిన సూర్యవంశీ ప్రకాష్‌ రూ.40వేలు ధరావతు, నెలకు రూ.15వేల చొప్పున తన కార్యాలయంలోని కొంత భాగం అద్దెకిచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం బలపడింది. ఇదే అదనుగా తనకు డబ్బు అవసరం ఉందని చెప్పి ఒకసారి సూర్యవంశీ వద్ద రూ.86వేలు అప్పుగా తీసుకున్నాడు. మరోసారి కార్తిక్‌రెడ్డి తండ్రిగా చెప్పిన రామ్మోహన్‌రెడ్డి పేరిట మరో వ్యక్తి సూర్యవంశీతో ఫోన్‌లో మాట్లాడాడు.

తాను ఎమ్మెల్సీనని, ఏపీ, తెలంగాణలో చాలా ఆస్తులున్నాయని చెప్పాడు. అత్యవసరంగా నగదు అవసరమని చెప్పడంతో విడతలవారీగా రూ.26లక్షల 95 వేలు కార్తిక్‌రెడ్డికి ముట్టచెప్పాడు. తర్వాత తీసుకున్న అప్పు ఎంతకూ తిరిగివ్వకపోవడంతో అనుమానం వచ్చిన బాధితుడు కార్తిక్‌రెడ్డి గురించి ఆరా తీశాడు. కార్తిక్‌రెడ్డి అమీర్‌పేటలోని అంకమ్మబస్తీ నివాసి అని, అతనితోపాటు అతని కుటుంబ సభ్యులు ఇదే తరహా మోసాలకు పాల్పడుతుంటారని గుర్తించాడు. మంగళవారం ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కార్తిక్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.