ETV Bharat / state

'వైద్యుల నిర్లక్ష్యమే నా భార్యను చంపేసింది' - అనంతపురం తాజా వార్తలు

వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య చనిపోయిందంటూ భర్త , కుటుంబసభ్యులు అనంతపురంలోని ఆసుపత్రి ముందు ధర్నా చేశారు.

husband protest at anantapur
వైద్యులు నిర్లక్ష్యంగానే తన భార్య చనిపోయిందని భర్త ఆందోళన
author img

By

Published : Sep 26, 2020, 4:02 PM IST

అనంతపురంలోని శ్రీనివాస ఆస్పత్రి వద్ద ఓ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. శ్రీపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు భార్య రాధకు థైరాయిడ్ సమస్య ఉండగా.. మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఒక రోజు గడిచినా.. రాధ స్పృహలోకి రాలేదు. బంధువులు వైద్యులను నిలదీశారు. పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పారని బంధువులు ఆరోపించారు.

ఈ క్రమంలో.. ఉదయం ఆమె మృతి చెందిందని చెప్పగా బంధువులు ఒక్కసారిగా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మహిళకు నలుగురు పిల్లలు ఉండగా.. వారు తల్లి లేని పిల్లలయ్యారంటూ బంధువుల రోదనలు ఆస్పత్రిలో మిన్నంటాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ఆస్పత్రులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.

అనంతపురంలోని శ్రీనివాస ఆస్పత్రి వద్ద ఓ మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. శ్రీపురం గ్రామానికి చెందిన రామాంజనేయులు భార్య రాధకు థైరాయిడ్ సమస్య ఉండగా.. మూడు రోజుల క్రితం ఆస్పత్రిలో చేరారు. ఆమెకు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. ఒక రోజు గడిచినా.. రాధ స్పృహలోకి రాలేదు. బంధువులు వైద్యులను నిలదీశారు. పరిస్థితి విషమించిందని వైద్యులు చెప్పారని బంధువులు ఆరోపించారు.

ఈ క్రమంలో.. ఉదయం ఆమె మృతి చెందిందని చెప్పగా బంధువులు ఒక్కసారిగా ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. మహిళకు నలుగురు పిల్లలు ఉండగా.. వారు తల్లి లేని పిల్లలయ్యారంటూ బంధువుల రోదనలు ఆస్పత్రిలో మిన్నంటాయి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి ఆస్పత్రులను సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:

తిరుమల, తిరుపతి పోలీసుల ఫేస్‌బుక్‌ ఖాతాలు హ్యాక్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.