ETV Bharat / state

లాక్​డౌన్​తో చిక్కుల్లో పడ్డ ఉద్యాన పంటల రైతులు - shoutdown AP due to corona virus taja news

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం లాక్​డౌన్​ విధించిన నేపథ్యంలో అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల ఉత్పత్తులు తోటలు దాటి మార్కెట్​కు రావటం లేదు. తాజాగా ఏర్పాటుచేసిన తాత్కాలిక మార్కెట్​తో కొంతమేర ఉపశమనం కలుగుతున్నా.. పంటకు ఆశించినంత లాభం రావటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.

horticulture crops under problems because of lockdown
లాక్​డౌన్​తో చిక్కుల్లో పడ్డ ఉద్యానవన పంటలు
author img

By

Published : Mar 29, 2020, 8:49 PM IST

లాక్​డౌన్​తో చిక్కుల్లో పడ్డ ఉద్యాన పంటల రైతులు

లాక్​డౌన్​ కారణంగా అనంతపురం జిల్లాలో ఉద్యాన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చేతికొచ్చిన పంట తోటలు దాటిరాలేని పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో కూరగాయల విక్రయాల కోసం ప్రతి చోటా అధికారులు తాత్కాలికంగా ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేశారు. అయితే ఆశించినంత లాభం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే బెండ, వంకాయ, టమోటా తదితర కూరగాయల పంటలు అనంతపురానికి వస్తున్నాయి. అరటి రైతుల నుంచి పంట కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తటంతో పండ్లను రవాణా చేసే లారీలకు ఇబ్బంది లేకుండా పోలీసుల అనుమతి ఇప్పించినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

లాక్​డౌన్​తో చిక్కుల్లో పడ్డ ఉద్యాన పంటల రైతులు

లాక్​డౌన్​ కారణంగా అనంతపురం జిల్లాలో ఉద్యాన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చేతికొచ్చిన పంట తోటలు దాటిరాలేని పరిస్థితి నెలకొంది. రెండు రోజుల క్రితం జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో కూరగాయల విక్రయాల కోసం ప్రతి చోటా అధికారులు తాత్కాలికంగా ప్రత్యేక మార్కెట్లు ఏర్పాటు చేశారు. అయితే ఆశించినంత లాభం రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో అత్యధికంగా సాగయ్యే బెండ, వంకాయ, టమోటా తదితర కూరగాయల పంటలు అనంతపురానికి వస్తున్నాయి. అరటి రైతుల నుంచి పంట కొనుగోలు చేయలేని పరిస్థితి తలెత్తటంతో పండ్లను రవాణా చేసే లారీలకు ఇబ్బంది లేకుండా పోలీసుల అనుమతి ఇప్పించినట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.

ఇదీ చూడండి:

కరోనా మొట్టమొదటగా ఎవరికి సోకిందో తెలుసా?

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.