ETV Bharat / state

కొవిడ్ బాధిత కుటుంబానికి చేయూత.. నిత్యావసర సరకులు, నగదు అందజేత - అనంతపురం జిల్లా తాజా వార్తలు

కరోనా బాధిత కుటుంబానికి కల్యాణదుర్గం పట్టణానికి చెందిన కొందరు చేయూత అందించారు. మున్సిపల్ వైస్​ఛైర్ పర్సన్ జయం రవీంద్రతోపాటు పలువురు కౌన్సిలర్లు ఆ కుటుంబానికి రూ.10వేల నగదు, నిత్యావసర సరకులు అందజేశారు.

కొవిడ్ బాధిత కుటుంబానికి చేయూత
కొవిడ్ బాధిత కుటుంబానికి చేయూత
author img

By

Published : Jun 18, 2021, 9:10 AM IST

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణానికి చెందిన దంపతులు.. సుధాకర్, సుమ. వీరికి ఐదుగురు సంతానం. అయితే సుధాకర్ కొవిడ్ బారినపడి మృత్యువాతపడ్డాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. ఈ క్రమంలో కష్టకాలంలో ఉన్న వాళ్లను ఆదుకోవడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్​ఛైర్ పర్సన్ జయం రవీంద్రతోపాటు పలువురు కౌన్సిలర్లు కలిసి నిత్యావసర సరకులు, రూ. 10వేల నగదు అందజేశారు.

కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయం త్వరగా అదేలా చూస్తామన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు ముందుకురావాలని కోరారు.

అనంతపురం జిల్లా కల్యాణదుర్గం పట్టణానికి చెందిన దంపతులు.. సుధాకర్, సుమ. వీరికి ఐదుగురు సంతానం. అయితే సుధాకర్ కొవిడ్ బారినపడి మృత్యువాతపడ్డాడు. దీంతో ఆ కుటుంబం రోడ్డునపడింది. ఈ క్రమంలో కష్టకాలంలో ఉన్న వాళ్లను ఆదుకోవడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. తాజాగా కళ్యాణదుర్గం మున్సిపల్ వైస్​ఛైర్ పర్సన్ జయం రవీంద్రతోపాటు పలువురు కౌన్సిలర్లు కలిసి నిత్యావసర సరకులు, రూ. 10వేల నగదు అందజేశారు.

కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ద్వారా వచ్చే సహాయం త్వరగా అదేలా చూస్తామన్నారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవడానికి దాతలు ముందుకురావాలని కోరారు.

ఇదీ చదవండి..

Vijaya Sai:'త్వరలో విశాఖ పరిపాలన రాజధానిగా మారుతుంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.