ETV Bharat / state

శానిటైజర్ తాగి చేనేత కార్మికుడు మృతి - dharmavaram crime news

శానిటైజర్ తాగి చేనేత కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

men died sanitizer drink
ధర్మవరంలో శానిటైజర్ తాగి చేనేత కార్మికుడు మృతి
author img

By

Published : May 19, 2021, 6:45 PM IST

అనంతపురం జిల్లా ధర్మవరంలో శానిటైజర్ తాగి వీరేష్ అనే చేనేత కార్మికుడు మృతి చెందాడు. పట్టు చీరల పాలిష్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వీరేశ్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శానిటైజర్ తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

అనంతపురం జిల్లా ధర్మవరంలో శానిటైజర్ తాగి వీరేష్ అనే చేనేత కార్మికుడు మృతి చెందాడు. పట్టు చీరల పాలిష్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వీరేశ్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో శానిటైజర్ తాగి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స కోసం ధర్మవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


ఇదీ చదవండి: ఆస్పత్రులకు వెళ్తూ.. వాహనాల్లోనే మృతి చెందుతున్న బాధితులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.