ETV Bharat / state

కొండలు తవ్వారు.. ప్రభుత్వ భూములు ఆక్రమించేశారు

ఎకరాలకు ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమవుతోంది. అనంతపురం జిల్లా కదిరిలో కబ్జారాయుళ్లకు అడ్డూఅదుపూ లేకుండాపోతోంది.

author img

By

Published : Jul 21, 2019, 1:43 AM IST

kadiri
కొండలు తవ్వారు.. ప్రభుత్వ భూములు ఆక్రమించేశారు

అనంతపురం జిల్లా కదిరిలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. విలువైన ప్రభుత్వ స్థలాలను స్థిరాస్తి వ్యాపారులు హస్తగతం చేసుకున్నారు. కొండలను తవ్వేస్తూ.. వాగులను పూడ్చేస్తూ.. పట్టణానికి 4 వైపులా వెంచర్లు వేసేశారు. కొంత భూమిని కొంటూ.. పక్కనే ఉన్న భూమిని కలిపేసుకుంటూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అధికార యంత్రాంగం ఎన్నికల్లో నిమగ్నవడం.. తర్వాత బదిలీల కారణంగా కొత్తవారు రావడం కబ్జారాయుళ్లకు కలిసొచ్చింది. పేదలకు ఇంటిపట్టాల పేరుతో.. కొండలను చదును చేసిన తీరును అధికారులు అడ్డుకోలేకపోయారు. ఫలితంగా... సుమారు 3 కిలో మీటర్ల పరిధిలోని వంకను.. స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

కొండలు తవ్వారు.. ప్రభుత్వ భూములు ఆక్రమించేశారు

అనంతపురం జిల్లా కదిరిలో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. విలువైన ప్రభుత్వ స్థలాలను స్థిరాస్తి వ్యాపారులు హస్తగతం చేసుకున్నారు. కొండలను తవ్వేస్తూ.. వాగులను పూడ్చేస్తూ.. పట్టణానికి 4 వైపులా వెంచర్లు వేసేశారు. కొంత భూమిని కొంటూ.. పక్కనే ఉన్న భూమిని కలిపేసుకుంటూ.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల అధికార యంత్రాంగం ఎన్నికల్లో నిమగ్నవడం.. తర్వాత బదిలీల కారణంగా కొత్తవారు రావడం కబ్జారాయుళ్లకు కలిసొచ్చింది. పేదలకు ఇంటిపట్టాల పేరుతో.. కొండలను చదును చేసిన తీరును అధికారులు అడ్డుకోలేకపోయారు. ఫలితంగా... సుమారు 3 కిలో మీటర్ల పరిధిలోని వంకను.. స్థిరాస్తి వ్యాపారులు ఆక్రమించేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Intro:గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్ విధానంలో సాగవుతున్న పంటలను పరిశీలించిన జర్మనీ దేశ ప్రతినిధులు Body:జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్ పద్ధతిన ఏపీలో అవలంబిస్తున్న విధానాలను క్షేత్రస్థాయిలో తెలుసుకోవడానికి జర్మనీ దేశానికి చెందిన ప్రతినిధులు గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం కొండవీడు గ్రామాన్ని సందర్శించారు.. ఈ విధానంలో పంటలు పండిస్తున్న రైతులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు.. వారి నుంచి సాగవుతున్న పంటల వివరాలు తెలుసుకున్నారు.. రైతులు తమ ఇళ్ల వద్దనే తయారు చేసుకుంటున్న ఘనజీవామృతం ,నీమాస్త్రం కషాయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం ఈ విధానంలో సాగవుతున్న పూల ,కూరగాయల తోటలను పరిశీలించారు.. ఈ సందర్భంగా జర్మనీ ప్రతినిధి ఇలాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సేంద్రియ వ్యవసాయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జర్మనీ బ్యాంకు కె ఎఫ్ డబ్ల్యూ తరఫున ఇక్కడకు వచ్చినట్లు తెలిపారు.. స్థానికంగా రసాయనిక ఎరువులు ,పురుగు మందులు వాడకుండా పూర్తి సహజ పద్ధతుల్లో ఎరువులు.. పురుగుమందుల అవశేషాలు లేని నాణ్యమైన పంటలను పండించడం సంతోషకరమన్నారు.. మనుషుల ఆరోగ్యానికి, భూమి సారవంతంగా ఉండటానికి ఏపీలో సేంద్రియ వ్యవసాయం మరింతగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు ..భవిష్యత్తులో సేంద్రియ పంట ఉత్పత్తులకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంటుంది అన్నారు.. స్థానిక స్వయం సహాయక సంఘాల సభ్యులు సంఘటితంగా సేంద్రియ వ్యవసాయం చేయడం అభినందనీయమన్నారు.. జర్మనీలో గోధుమలు, ద్రాక్ష, బార్లీ ,బీన్స్ ,బంగాళదుంప అధికంగా పండిస్తున్నట్లు తెలిపారు.. సేంద్రియ వ్యవసాయం 10% ఉంటుందన్నారు ..రసాయన ఎరువుల వాడకం ద్వారా వచ్చిన పంట దిగుబడులు కన్నా ..సేంద్రియ విధానంలో 20% తక్కువ దిగుబడి వచ్చినా మార్కెట్లో వాటికి 30 శాతం అధిక ధరలు లభిస్తాయన్నారు.. వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న జనాభా రెండు శాతం మాత్రమే అన్నారు ..వ్యవసాయ యాంత్రీకరణ సాయంతో ఒక్క రైతు 200 ఎకరాలకు సాగు చేస్తున్నారన్నారు ..గుంటూరు జిల్లా జెడ్ బి ఎం ఎఫ్ dpm రాజకుమారి కొండవీడు పరిధిలో 430 మంది రైతులు 599 ఎకరాల్లో ఈ విధానంలో పంటలు సాగు చేస్తున్నట్లు తెలిపారు.. 53 స్వయం సహాయక సంఘాలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారన్నారు.. Conclusion:మల్లికార్జున్ రావు ఈటీవీ చిలకలూరిపేట గుంటూరు జిల్లా ఫోన్ నెంబర్ 8008883217
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.