కిరాయికి పిలిస్తే రాను అని చెప్పినందుకు ఆటో డ్రైవర్ని హత్య చేసిన కేసులో అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణ పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రి పట్టణం టైలర్స్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ దస్తగిరి...రెండు రోజుల కిందట నలుగురు చేతిలో హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తాడిపత్రికి చెందిన ఆదినారాయణ, నారాయణ స్వామి, పుట్లూరు మండలం గాండ్లపాడుకి చెందిన ప్రవీణ్ కుమార్, రమేష్లను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇవీ చదవండి...మద్యం మత్తులో రాళ్ల దాడి: ఆటో డ్రైవర్ మృతి