ETV Bharat / state

ఇరువర్గాల మధ్య ఘర్షణ... 9 మందికి తీవ్రగాయాలు

ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 9 మంది తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లా గుత్తిలో జరిగింది. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

author img

By

Published : Jun 25, 2020, 6:43 AM IST

fight between two sides in gutti ananthapuram district
ఇరువర్గాల మధ్య ఘర్షణ... 9 మందికి తీవ్రగాయాలు

అనంతపురం జిల్లా గుత్తిలోని ఎస్సీ కాలనీలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీ యువకులు ఓ ఇంటి ముందు కూర్చుని ప్రతిరోజూ పబ్జీ ఆడడం, జూదం ఆడుతుండటంతో ఆ ఇంటి యజమాని వారిని మందలించారు. ఆ యువకులు ఆయన్ను కొట్టారు. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ నెలకొంది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక మహిళతో సహా 9 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

అనంతపురం జిల్లా గుత్తిలోని ఎస్సీ కాలనీలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీ యువకులు ఓ ఇంటి ముందు కూర్చుని ప్రతిరోజూ పబ్జీ ఆడడం, జూదం ఆడుతుండటంతో ఆ ఇంటి యజమాని వారిని మందలించారు. ఆ యువకులు ఆయన్ను కొట్టారు. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఘర్షణ నెలకొంది. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక మహిళతో సహా 9 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

శ్రీతాళం వృక్షం పరిశీలించిన జీవవైవిధ్య సంస్థ అధ్యక్షులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.