ETV Bharat / state

ఇంటింటికి గుడ్లు పంచిన వైకాపా నేత

author img

By

Published : Apr 3, 2020, 12:24 PM IST

తాడిపత్రి టైలర్స్​ కాలనీలో ఉన్న ప్రజలకు వైకాపా నాయకుడు కాకర్ల రంగనాథ్​ కోడిగుడ్లను పంపిణీ చేశారు. ఇంటికి 30 గుడ్ల చొప్పున ఆ కాలనీలో ఉన్నవారందరికీ ఇచ్చారు.

eggs distributed by ycp leader
తాడిపత్రి టైలర్స్​ కాలనీలో గుడ్లు పంచుతున్న కాకర్ల రంగనాథ్​

అనంతపురం జిల్లా తాడిపత్రి టైలర్స్​ కాలనీలో ఉన్నవారంతా దినసరి కూలీలే. కరోనా ప్రభావంగా కాలనీలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. వీరికి పోషకాహారం అందించేందుకు వైకాపా నాయకుడు కాకర్ల రంగనాథ్​ ముందుకొచ్చారు. తన సొంత ఖర్చులతో లక్షా ఐదు వేల కోడిగుడ్లను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి 30 గుడ్ల చొప్పున 3,500 ఇళ్ల వద్దకు వెళ్లి ఇచ్చారు. పోషకాహారం తీసుకోవడంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:

అనంతపురం జిల్లా తాడిపత్రి టైలర్స్​ కాలనీలో ఉన్నవారంతా దినసరి కూలీలే. కరోనా ప్రభావంగా కాలనీలో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి. వీరికి పోషకాహారం అందించేందుకు వైకాపా నాయకుడు కాకర్ల రంగనాథ్​ ముందుకొచ్చారు. తన సొంత ఖర్చులతో లక్షా ఐదు వేల కోడిగుడ్లను పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి 30 గుడ్ల చొప్పున 3,500 ఇళ్ల వద్దకు వెళ్లి ఇచ్చారు. పోషకాహారం తీసుకోవడంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని ఆయన చెప్పారు.

ఇదీ చదవండి:

గుత్తికోటలో పేదలకు కూరగాయల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.